|
ఇంతకేం జరిగిందంటే..
ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్లో స్టోక్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆలస్యంగా ఈ టోర్నీలో పాల్గొన్న స్టోక్స్.. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టాడు. అంతకుముందు తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నుంచి అర్దాంతరంగా తపుకున్నాడు.
వెంటనే న్యూజిలాండ్ బయల్దేరాడు. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్స్లో 14 రోజుల క్వారంటైన్ పాటించాడు. అయితే ఈ క్వారంటైన్ పరిస్థితి గురించి ఇటీవల మాట్లాడిన స్టోక్స్.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకుడదని, తాను బద్ద శత్రువుగా భావించే శ్యామూల్స్కు కూడా రావద్దని కోరుకుంటానని సరాదాగా చెప్పుకొచ్చాడు. ప్రభుత్వాలు ఇచ్చే హోటల్ను బట్టి క్వారంటైన్ కష్టాలు ఉంటాయని, మంచి హోటల్ దొరికితే పర్లేదని, కానీ దురదృష్టవశాత్తు అలా జరగకుంటే నరకమేనన్నాడు.
స్టోక్స్ కామెంట్స్ను అపార్డం చేసుకోని..
స్టోక్స్ నోట తన మాట రావడమే తప్పుగా భావించిన శ్యామూల్స్.. అతని వ్యాఖ్యలను అపార్దం చేసుకొని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. తన ఇన్ స్టా స్టోరీల్లో రాయలేని పదాలతో వరుసగా కామెంట్స్ చేశాడు.‘ఈ తెల్లోడు ఇంకా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. 14 రోజులు నీ భార్యను పంపించరా.. 14 సెకన్లలో జమైకన్గా మార్చుతా.'అంటూ రాయలేని పదాలతో బూతుపురాణం అందుకున్నాడు. ఇక శ్యామూల్స్ తీరుపై యావత్ క్రికెట్ ప్రపంచం మండిపడుతుంది. స్టోక్స్పై ఇంత విద్వేశం దేనికంటూ నిలదీస్తోంది.
మైదానంలో స్టోక్స్ X శ్యామూల్స్
2015లో ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో శామ్యూల్స్ అవుటై పెవిలియన్ కు వెళ్తుండగా బౌండరీ లైన్ వద్ద ఉన్న స్టోక్స్ అతడ్ని రెచ్చగొట్టాడు. "ఇక వెళ్లి స్టేడియంలో కూర్చో" అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. అంతే కాకుండా 2016 టీ20 వరల్డ్ కప్ లోనూ వీరి మధ్య ఆసక్తికరమైన వాగ్వాదం జరిగింది. ఇంగ్లండ్ జట్టుపై శామ్యూల్స్ చెలరేగిపోతున్న సమయంలో స్టోక్స్ మాటలకు పని చెప్పాడు. ఆ సమయంలో నీ పని నువ్వు చేసుకో అంటూ శామ్యూల్స్ కూడా దీటుగానే బదులిచ్చాడు.
Ind vs Aus: విరాట్ కోహ్లీతో వైరమే.. రోహిత్ శర్మ వేటుకు కారణమా?