ఆస్ట్రేలియా కోరినా..
అయితే వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో రిజర్వు డే కేటాయించాలని క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే ఐసీసీని కోరింది. అయినా రిజర్వ్ డే కేటాయించడం కుదరదని ఐసీసీ స్పష్టం చేసింది. దీంతో లీగ్ దశలో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించిన భారత్ ఫైనల్కు చేరింది. మూడు విజయాలే సాధించిన ఇంగ్లండ్ నిరాశగా నిష్ర్కమించింది.
అర్థ రహితం..
అయితే ఈ ఫలితం అనంతరం ఓ జర్నలిస్ట్ రిజర్వ్ డే లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్కు బదులిస్తూ మార్క్ వా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 'ఈ ఏడాది అతిపెద్ద క్రికెట్ టోర్నీ నాకౌట్ మ్యాచులకు ఐసీసీ రిజర్వు డే కేటాయించకపోవడం పూర్తిగా అర్థరహితం. జీవితకాలంలో అతిపెద్ద మ్యాచ్ ఆడే అవకాశాన్ని కొందరు క్రికెటర్లు కోల్పోయారు' అని మార్క్వా ట్వీట్ చేశారు. దానికి కామన్ సెన్స్ అనే హ్యాష్ట్యాగ్ను జత చేశాడు. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

ఇంగ్లండ్ పాపం పండింది..
ఐసీసీ నిబంధనలను అడ్డుపెట్టుకునే ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలిచిందనీ.. ఇప్పుడు అవే నిబంధనలు ఇంగ్లండ్ మహిళల జట్టును ఫైనల్కు చేరనివ్వలేదని కామెంట్ చేస్తున్నారు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ బౌండరీల నిబంధన ఆధారంగా విశ్వవిజేతగా నిలిచింది. ఆధ్యాంతం ఉత్కంఠగా సాగిన నాటి మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడం.. సూపర్ ఓవర్కు దారితీయడం.. సూపర్ ఓవర్ స్కోర్లు కూడా మళ్లీ సమం కావడం.. బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లండ్ గెలిచి టైటిల్ అందుకోవడం అందరికీ తెలిసిందే.
ఇంగ్లండ్ పాపం పండింది.. భారత్ ఫైనల్ చేరింది..!!

ముందే ఊహించాం..
వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోవడం దురదృష్టకరమని టీమిండియా సారథి హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. భవిష్యత్తులోనైనా రిజర్వు డే ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది. అన్ని మ్యాచులు గెలవకపోతే సెమీస్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాము ముందే ఊహించామని వెల్లడించింది. ప్రపంచకప్ను ఇలా ముగించడం చిరాకు కలిగించిందని ఇంగ్లండ్ కెప్టెన్ హేథర్ నైట్ తెలిపింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై ఓడిపోవడం తమ కొంప ముంచిందని అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications
