Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా అన్నందుకు సెహ్వాగ్‌పై నాకు ఎలాంటి కోపం లేదు: మ్యాక్స్‌వెల్

KXIPs Glenn Maxwell responds to Virender Sehwag’s ‘10-crore cheerleader’ comment on him

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెట్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 2020 సీజన్‌లో దారుణంగా విఫలయ్యాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ఈ ఆసీస్ హిట్టర్ ఈ సీజన్‌లో కనీసం ఒక్క సిక్స్ కొట్టలేకపోయాడు. పేలవమైన ఆటతీరుతో జట్టు వైఫల్యానికి కారణమయ్యాడు. దాంతో మ్యాక్సీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ. 10 కోట్లు పెట్టి మ్యాక్సీని పంజాబ్ కొనుగోలు చేయగా.. అతను 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. దాంతో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. పంజాబ్‌ జట్టులో రూ.10 కోట్ల ఖరీదైన చీర్‌లీడర్ అని విమర్శించాడు. తాజాగా ఈ కామెంట్స్‌పై స్పందించిన మ్యాక్సీ అలా అన్నందుకు సెహ్వాగ్‌పై తనకు ఎలాంటి కోపం లేదని స్పష్టం చేశాడు.

సెహ్వాగ్ విమర్శల్లో తప్పులేదు..

సెహ్వాగ్ విమర్శల్లో తప్పులేదు..

సెహ్వాగ్ విమర్శలను తాను అర్థం చేసుకోగలనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.‘రూ.10 కోట్ల ఖరీదైన చీర్ లీడర్ అంటూ నాపైన కామెంట్ చేసిన సెహ్వాగ్‌పై ఎలాంటి కోపం లేదు. అతని విమర్శలను నేను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం అతను మీడియాలో ఉన్నాడు. ఆటగాళ్ల వైఫల్యాలను విమర్శించే హక్కు అతనికి ఉంది. వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నా. ఆ కామెంట్స్‌ను పట్టించుకోకుండా ముందుకు సాగుతా. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు ఉత్ప్రేరకంగా ఉపయోగించుకుంటా'అని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు.

నాకు కొత్తకాదు..

నాకు కొత్తకాదు..

ఇక ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం తనకు కొత్త కాదని మ్యాక్సీ తెలిపాడు. ఇలాంటివి ఎన్నో ఎదుర్కోన్నానని చెప్పుకొచ్చాడు. ‘ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం నాకు కొత్తకాదు. గతంలో కొంత మానసికంగా కుంగిపోయినా ఇప్పుడు బాగానే ఉన్నా.'అని తెలిపాడు. ఇక మానసిక సమస్యతో బాధపడిన మ్యాక్సీ కొన్నాళ్లు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్‌తో పునరాగమనం చేయాలనుకున్నాడు. కానీ కరోనా లీగ్ ఆగిపోవడంతో ఐపీఎల్ బరిలోకి దిగాడు. ప్రస్తుతం భారత్‌తో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ఆడనున్నాడు.

రూ. 10 కోట్ల ఖరీదైన చీర్ లీడర్..

రూ. 10 కోట్ల ఖరీదైన చీర్ లీడర్..

ఐపీఎల్ 2020 సీజన్‌లో విఫలమైన ఆటగాళ్లపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోన్‌ ఫించ్‌, ఆండ్రూ రస్సెల్, మాక్స్‌వెల్, షేన్ వాట్సన్‌, డేల్ స్టెయిన్‌ వైఫల్యాలపై వీరూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. పంజాబ్‌ జట్టులో రూ.10 కోట్ల ఖరీదైన చీర్‌లీడర్‌. లీగ్‌లో గత కొన్ని సీజన్లుగా తన ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. అయితే ఈ సారి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టి మరింత విఫలమయ్యాడు. ఇది అతనికి అత్యంత ఖరీదైన విహారయాత్రగా భావించవచ్చు.'అని ఘాటుగా విమర్శించాడు.

IPL 2021కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ ఇద్దర్నీ రిటైన్ చేసుకోవాలి!

Story first published: Friday, November 20, 2020, 15:47 [IST]
Other articles published on Nov 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+