For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్స్‌వెల్ కోసం ఎందుకు వెంపర్లాడతారో? కోట్లు ఎందుకు ఖర్చు చేస్తారో: సెహ్వాగ్

 IPL 2020: Virender Sehwag slams Glenn Maxwell’s hefty price tag despite consistent failures

న్యూఢిల్లీ: ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యే గ్లేన్ మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు ఎందుకు వెంపర్లాడుతాయో అర్థం కావడం లేదని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ. 9 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ మాక్స్‌వెల్‌ను కొనుగోలు చేయగా.. ఈ సీజన్‌ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రూ. 10.75 కోట్లకు ఈ ఆసీస్ ప్లేయర్‌ను దక్కించుకుంది. తీరా అతను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కూడా 12 బంతుల్లో 7 పరుగులే చేసిన మాక్స్‌వెల్ రనౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. దాంతో అతని ఆటతీరుపై వీరూ విమర్శలు గుప్పించాడు.

 అదే తడబాటు..

అదే తడబాటు..

‘మాక్స్‌వెల్‌ మైండ్‌సెట్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ప్రతీ ఐపీఎల్ సీజన్‌లోనూ మాక్స్‌వెల్ తీరు ఇంతే. భారీ ధరకు అమ్ముడుపోవడం.. దారుణంగా విఫలమవడం అతనికి అలవాటు అయిపోయింది. అయినా ఫ్రాంఛైజీలు అతని కోసం వేలంలో ఎందుకు వెంపర్లాడుతాయో..? నాకు అర్థం కావడం లేదు. నా అంచనా ప్రకారం వచ్చే సీజన్‌కు అతని ధర రూ. 1-2 కోట్లకి పడిపోవచ్చు.

 హాఫ్ సెంచరీ చేసి నాలుగేళ్లు..

హాఫ్ సెంచరీ చేసి నాలుగేళ్లు..

పంజాబ్ టీమ్ ప్రతి మ్యాచ్‌లోనూ స్వేచ్ఛగా చెలరేగిపోయే వెసులబాటు కల్పిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లోనూ 7వ ఓవర్‌లోనే అతన్ని బ్యాటింగ్‌కి పంపింది. చాలినన్ని ఓవర్లు ఉన్నా.. అతను విఫలమయ్యాడు. 2016 సీజన్‌లో అతను చివరిసారిగా హాఫ్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతను పూరన్ కంపెనీ ఇస్తూ.. అండగా ఉంటే పంజాబ్ గెలిచేది. పూరన్ ఒంటరిగా ఏం చేయలేకపోయాడు'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన మాక్స్‌వెల్ కేవలం 48 పరుగులే చేశాడు. అతని వైఫల్యం పంజాబ్ విజయవకాశాలను దెబ్బతీస్తుంది. తదుపరి మ్యాచ్‌లో అతనికి అవకాశం దక్కకపోవచ్చు.

పూరన్ ఒక్కడే..

పూరన్ ఒక్కడే..

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బెయిర్‌స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్‌ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్‌ పూరన్‌ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్‌ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ ముగియడం పంజాబ్‌ వైఫల్యాన్ని సూచిస్తోంది.

దారుణం.. ధోనీ బాగా ఆడకపోతే జీవాను రేప్ చేస్తామంటూ బెదిరింపులు!

Story first published: Friday, October 9, 2020, 18:12 [IST]
Other articles published on Oct 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+