
వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు
మార్కస్ స్టొయినిస్, షిమ్రన్ హెట్మెయిర్, అక్షదీప్ నాథ్, నేథన్ కౌల్టర్నైల్, కొలిన్ డి గ్రాండ్హోమ్, ప్రయాస్ బర్మన్, టిమ్ సౌథీ, కుల్వంత్ కేజ్రోలియా, హిమ్మత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, మలింగ్ కుమార్, డేల్ స్టెయిన్

విడుదల చేయడానికి కారణం
ఐపీఎల్లో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 12 మంది ఆటగాళ్లను వేలానికి విడుదల చేసింది. అందులో దక్షిణాఫ్రికా మాజీ పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ కూడా ఉన్నాడు. షిమ్రోమ్ హెట్ మెయిర్ చాలా హైప్తో ఆర్సీబీ జట్టులోకి వచ్చాడు. అయితే, ఇప్పటివరకు అతడు ఒక మ్యాచ్-విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. జట్టుకు సైతం ఎలాంటి న్యాయం చేయలేకపోయాడు.
IPL 2020: వ్యూహాత్మక అడుగు, 9 మందిని విడుదల చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ, మొయిన్ అలీ, యుజువేంద్ర చాహల్, ఏబీ డివిలియర్స్, పార్థివ్ పటేల్, మహ్మద్ సిరాజ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, గురుకీరత్ మన్, దేవత్ పడిక్కల్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని

ఆర్సీబీ వద్ద మిగిలిన నగదు
ఐపీఎల్ 2019 వేలం తర్వాత రాయల్స్ ఛాలెజర్స్ వారి పర్సులో రూ .1.8 కోట్లు మిగిలి ఉన్నాయి. 12 మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఆర్సీబీ రూ. 23 కోట్లకు పైగా సంపాదించింది. మరోవైపు బిసిసిఐ నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు రానున్నాయి. దీంతో వచ్చే సీజన్లో జరిగే ఐపిఎల్ 2020 వేలంలో రూ. 27.9 కోట్లు ఖర్చు చేయవచ్చు.
IPL 2020: సన్రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్లో మిగిలిన నగదు ఇదే


Click it and Unblock the Notifications
