
వేలానికి విడుదల చేసిన ఆటగాళ్లు
క్రిస్ మోరిస్, కొలిన్ ఇంగ్రామ్, బి అయ్యప్ప, హనుమ విహారి, జలజ్ సక్సేన, మన్జ్యోత్ కల్రా, నాథుసింగ్, అంకుష్ బేయాన్స్, కొలిన్ మన్రో

విడుదల చేయడానికి కారణం
ఐపీఎల్ 2019లో క్రిస్ మోరిస్ గాయాల బారిన పడ్డాడు. హనుమా విహారీ గత సీజన్లో పెద్దగా రాణించిన దాఖలా లేదు. రాజస్థాన్కు సారథ్యం వహించిన అజింక్య రహానె, కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. పలు కారణాల వల్ల కోలిన్ ఇంగ్రామ్, కోలిన్ మున్రో, జలాజ్ సక్సేనా, మంజోత్ కల్రా వంటి వారందరిని విడుదల చేసింది.

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
శ్రేయస్ అయ్యర్, పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, సందీప్ లమిచానె, రబాడ, కీమో పాల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, రవిచ్రందన్ అశ్విన్ (బదిలీ), అజింక్య రహానె (బదిలీ)

మిగిలిన నగదు
ఐపీఎల్ 2019 వేలానికి ముందు ఢిల్లీ పర్సులో మిగిలి ఉన్న నగదు రూ. 5.3 కోట్లు. తొమ్మిది మంది ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా ఢిల్లీ అత్యధికంగా రూ .19 కోట్లు మిగిలాయి. మరోవైపుబిసిసిఐ వైపు నుండి అదనంగా 3 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఐపీఎల్ 2020 వేలంలో రూ. 27.85 కోట్లు ఖర్చు చేయవచ్చు.


Click it and Unblock the Notifications
