
ఇంతకీ విషయం ఏంటంటే..
అఫ్గానిస్థాన్కు చెందిన ఓపెనర్ నజీబ్ తరకాయ్ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. తన సహచర ఆటగాడి అకాల మరణానికి సంతాపం తెలిపేందుకు రషీద్ ఖాన్ బ్లాక్ రిబ్బన్తో బరిలోకి దిగేందుకు సిద్దమవ్వగా.. తాము కూడా ధరిస్తామని జట్టు మొత్తం అండగా నిలిచింది. ఈ కారణంగానే ఆటగాళ్లంతా బ్లాక్ రిబ్బన్స్తో మైదానంలో దిగారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో..
ఇక రోడ్డు ప్రమాదంలో గతవారం గాయపడిన అఫ్ఘానిస్థాన్ టాపార్డర్ బ్యాట్స్మన్ నజీబ్ తరకాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఈనెల 2న ఈశాన్య నన్గహర్లో నజీబ్ రోడ్డు దాటుతుండగా కారు బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. నజీబ్ మృతికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సంతాపం వ్యక్తం చేశాయి. 2014 టీ20 వరల్డ్కప్తో జాతీయ జట్టులోకి వచ్చిన 29 ఏళ్ల నజీబ్ కేరీర్లో 12 మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. 2017లో ఐర్లాండ్తో ఏకైక వన్డే ఆడాడు.

ఆల్రౌండ్ షో..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' బెయిర్స్టో (55 బంతుల్లో 97; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... వార్నర్ (40 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్కు 91 బంతుల్లో 160 పరుగులు జోడించారు. అనంతరం పంజాబ్ 16.5 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. నికోలస్ పూరన్ (37 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 12 పరుగులకే 3 వికెట్లు తీసి రషీద్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగియడం పంజాబ్ వైఫల్యాన్ని సూచిస్తోంది.
సన్రైజర్స్కు భారీ స్కోర్ చేసే సత్తా లేదా? ఇప్పుడేం అంటావ్ సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్!


Click it and Unblock the Notifications
