For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుబాయ్‌లో విజృంభిస్తున్న కరోనా.. గీత దాటొద్దని ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్!

IPL 2020: BCCI warns players instructs to follow all protocols

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ కోసం దుబాయ్ వెళ్తున్న క్రికెటర్లు కరోనా ప్రొటోకాల్స్ ఉల్లంఘించకుండా జాగ్రత్తగా ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) హెచ్చరించింది. ఎన్నోఆటంకాలను అధిగమించిన తర్వాత సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనుంది. అయితే ఇటీవల యూఏఈలో కరోనా విజృంభణ పెరిగింది. దీంతో అప్రమత్తమైన బోర్డు.. ప్లేయర్లు, ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 ఎక్కడపడితే అక్కడ తిరగవద్దు..

ఎక్కడపడితే అక్కడ తిరగవద్దు..

‘ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల వేరేవాళ్లు ఇబ్బంది పడకూడదని మా భావన. అందుకే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఓనర్లు, ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. కరోనా ప్రొటోకాల్స్ ను బ్రేక్ చేయవద్దని చెప్పాం. ఆటగాళ్ల భద్రతకు అవసరమైన అన్ని వసతులను యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కరోనా ముప్పు ఉండడంతో ఎక్కడపడితే అక్కడ తిరగవద్దంటూ అందరికీ హెచ్చరికలు పంపాం.'అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.

యూఏఈ చేరిన మూడు జట్లు

యూఏఈ చేరిన మూడు జట్లు

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2020 కోసం తొలి విడతగా కింగ్స్ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ గురువారం యూఈఏలో అడుగు పెట్టాయి. ముందుగా రాయల్స్, పంజాబ్ దుబాయ్ చేరుకున్నాయి. మరో స్పెషల్ ఫ్లైట్లో కేకేఆర్ సాయంత్రం అబుదాబిలో అడుగుపెట్టింది. టోర్నీ కోసం ఆ జట్టు అబుదాబిలోనే బేస్ ఏర్పాటు చేసుకుంది. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం మధ్యాహ్నం 12.45 కు దుబాయ్ బయల్దేరుతుందని ఆ టీమ్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు

 హర్భజన్ ఆలస్యం..

హర్భజన్ ఆలస్యం..

ఇప్పటికే చెన్నైలో ఏర్పాటు చేసిన ట్రెయినింగ్ క్యాంపులో ఐదు రోజుల నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, ఈ క్యాంప్ కు దూరంగా ఉన్న సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెన్నైతో కలిసి దుబాయ్ వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతను రెండు వారాలు ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. కాగా, యూఏఈ వెళ్లేముందే ప్లేయర్లకు పలుసార్లు కరోనా టెస్టులు చేశారు. అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆరో రోజుల ఐసోలేషన్లో మరో ఒక్కో రోజు గ్యాప్లో మూడు సార్లు టెస్టులు చేయించుకుంటారు. అన్నింటిలో నెగెటివ్ వస్తేనే బయో బబుల్లో ట్రెయినింగ్ కు అనుమతిస్తారు.

రైనా మీకు ఇంకా ఆడే సత్తా ఉంది.. ఇంత త్వరగా వీడ్కోలు పలుకుతారని ఊహించలేదు: ప్రధాని మోదీ

Story first published: Friday, August 21, 2020, 12:40 [IST]
Other articles published on Aug 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+