హైదరాబాద్: తనను తాను నిరంతరం మెరుగుపరచుకుంటూనే ఉంటానని టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవలే బుమ్రా టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు అందుకున్న పేసర్గా గుర్తింపు పొందాడు.
మీరే చూడండి: బంతిని కాదు లియాన్ జారవిడించింది.. యాషెస్ ట్రోఫీని! (వీడియో)
తొలి టెస్టు అనంతరం బుమ్రా మాట్లాడుతూ "గతంలో ఇన్స్వింగర్లు అధికంగా విసిరేవాడిని. ఎక్కువ టెస్టు మ్యాచులు ఆడిన తర్వాత ఔట్స్వింగర్లు సంధించే ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రత్యేకించి ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత" అని చెప్పుకొచ్చాడు. బుమ్రా ఇప్పటివరకు 11 టెస్టుల్లోనే 20.63 యావరేజితో 55 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
"ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంది. ఒక బౌలింగ్ యూనిట్గా మేం ఎక్కువ అస్త్రాలతో దాడి చేస్తున్నాం. నేను, ఇషాంత్ క్రీజు వెడల్పును ఉపయోగించుకొని స్వింగ్ సృష్టించాం. స్వింగర్లు వేసేందుకు ఎంతో కష్టపడ్డాను. నేను ఎప్పుడూ కొత్తగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను" అని బుమ్రా అన్నాడు.
స్టోక్స్ను ఆకాశానికెత్తిన ఇంగ్లీషు మీడియా: అక్కసు వెళ్లగక్కిన ఆసీస్ మీడియా
"బ్రేక్ అనంతరం తిరిగి జట్టులోకి రావడంతో వెస్టిండిస్ తొలి ఇన్నింగ్స్లో కొంత అలసటతో ఉన్నాను. రెండో ఇన్నింగ్స్లో గాడిన పడ్డాను. వికెట్ కొన్నిసార్లు ఫ్లాట్గా అనిపించింది. అప్పుడు భిన్నంగా బంతులేశాం. నాలుగో రోజు స్వింగ్కు అనుకూలించింది. మా ఫాస్ట్ బౌలర్లం నిరంతరం పిచ్ గురించి చర్చించుకుంటునే ఉన్నాం" అని బుమ్రా తెలిపాడు.రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆగస్టు 30 నుంచి రెండో టెస్టు జమైకా వేదికగా జరగనుంది.