అంబటికి అన్యాయం చేశారు..
‘2019 వన్డే ప్రపంచకప్లో రాయుడిని ఎంపిక చేయకుండా అతనికి అన్యాయం చేశారు. ఇప్పుడు అతని ఆటను ఎంత కొనియాడిన తక్కువే. 2019 ప్రపంచకప్ జట్టులో రాయుడు ఉండాల్సింది. కానీ ఐపీఎల్ 2020 సీజన్ ఫస్ట్ మ్యాచ్తోనే తానేంటో నిరూపించుకున్నాడు. తన సత్తా ఏంటో తెలియజేశాడు. వయసే కాకుండా ప్రతిభను కూడా పరిగణించాలని చాటి చెప్పాడు.'అని భజ్జీ కొనియాడు.
బౌలింగ్ అద్భుతం..
ఇక ముంబైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో తమ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారని భజ్జీ కొనియాడాడు. ముఖ్యంగా పియూష్ చావ్లా ఆకట్టుకున్నాడని తెలిపాడు. ‘నేను బౌలింగ్ అటాక్ను కూడా ప్రశంసించాలనుకుంటున్నా. ఎందుకంటే బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా పియూష్ చావ్లా ఆకట్టుకున్నాడు. పరుగులను కట్టడి చేయడంతో పాటు రోహిత్ శర్మ వికెట్ తీశాడు. ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై 162 పరుగులకే పరిమితమైంది'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఆ లెక్కన చెన్నైదే టైటిల్..
తొలి మ్యాచ్లోనే తమ జట్టు విజయం సాధించిందని, దీన్ని ఇలాగే కొనసాగించాలని భజ్జీ ఆకాంక్షించాడు. రెండేళ్ల క్రితం (2018 సీజన్) కూడా చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించిందని, ఆ సీజన్ ఫైనల్ చేరి టైటిల్ కూడా అందుకుందని గుర్తు చేశాడు. ఇదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందని, ఆ లెక్కన చెన్నై సూపర్ కింగ్స్దే టైటిలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
త్రీడైమన్షన్ ఆటగాడంటూ...
ఇక 2019 ప్రపంచకప్ భారత జట్టులో కచ్చితంగా ఎంపిక అవుతానని ధీమాతో ఉన్న రాయుడికి ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొండి చేయి చూపించిన విషయం తెలిసిందే. త్రీడైమన్షన్ పేరిట రాయుడికి బదులు విజయ్శంకర్ను తీసుకోగా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. పైగా ధావన్ గాయపడినా అతడి స్థానంలో రిషభ్పంత్ను తీసుకున్నారు. దీంతో తీవ్ర నిరాశ చెందిన అంబటి రాయుడు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక నిన్నటి మ్యాచ్ పరిస్థితులు ఇంచుమించు 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ను తలపించడంతో భారత జట్టులో రాయుడు ఉంటే విజయం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
అంబటి రాయుడిని కించపర్చిన సంజయ్ మంజ్రేకర్.. మండిపడుతున్న ఫ్యాన్స్!