For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎలే పెద్ద బ్రాండ్‌ .. చైనా స్పాన్సర్లు ఎందుకు: హర్భజన్

Harbhajan Singh confirms he wont endorse Chinese products from now

న్యూఢిల్లీ: చైనా వస్తువులను బహిష్కరించాలని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పిలుపునిచ్చాడు. గల్వాన్‌ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు మరణించడంపై దేశంలో చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ భజ్జీ స్పందించాడు. భారత్‌పై దాడులకు తెగబడుతున్న చైనా మన డబ్బుతో నడవకూడదనీ.. అందుకే ఆ దేశ వస్తువుల వాడకాన్ని బహిష్కరించాలని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.

బాయ్‌కట్ చేయడమే మంచిది..

బాయ్‌కట్ చేయడమే మంచిది..

చైనా వస్తువులను సెలబ్రిటీలు ఆమోదిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయన్న భజ్జీ.. అలాంటి వారి జాబితాలో మాత్రం తానులేనని స్పష్టం చేశాడు.‘స్వయం సమృద్ధిని సాధించాలంటే చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయడమే మంచిది. వాళ్ల దేశాన్ని మన సొమ్ముతో ఎలా నడుపుతారు? చైనా వస్తువులను బాయ్‌కాట్‌ చేసే వారితో నేనూ ఉంటా. నాకు ఎలాంటి చైనా ఎండార్స్‌మెంట్లు లేవు' అని హర్భజన్‌ చెప్పాడు.

 ఏ బ్రాండ్ అవసరంలేదు..

ఏ బ్రాండ్ అవసరంలేదు..

ఐపీఎల్‌ స్పాన్షర్‌షిప్‌ ఒప్పందాలపై చర్చించేందుకు వచ్చే వారంలో సమావేశం కానున్నట్టు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ అంశంపైనా భజ్జీ స్పందించాడు. ఐపీఎల్‌ ప్రమోషన్స్‌కు ఏ బ్రాండూ అవసరం లేదనీ.. అదే ఒక పెద్ద బ్రాండ్‌ అన్నాడు. చైనా స్పాన్షర్లు లేకపోతే ఇంకా చాలా కంపేనీలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ‘ఐపీఎలే ఒక పెద్ద బ్రాండ్‌. దానికి ఎటువంటి ప్రచారం అవసరం లేదు. అలాంటప్పుడు చైనా స్పాన్సరర్లే ఎందుకు? వీళ్లు కాకపోతే.. ఇంకొకరు వస్తారు' అని అన్నాడు. ఐపీఎల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా సెల్‌ఫోన్ల తయారీ సంస్థ వివోతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే నేపథ్యంలో భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఐఓఏ కటీఫ్..

ఐఓఏ కటీఫ్..

ఈ చైనా దాష్టికానికి బుద్ది చెప్పాలని భారత ప్రజలు భావిస్తున్న నేపథ్యంతో చైనీస్ స్పోర్ట్స్ పరికరాల ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహ్తా గురువారం స్పష్టం చేశారు. ‘మా కిట్ స్పాన్సర్ లీనింగ్‌తో టోక్యో ఒలింపిక్స్ వరకూ అగ్రిమెంట్ ఉంది. అయితే మాకు దేశమే ముఖ్యం. ఒకవేళ లీనింగ్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాలని సభ్యులు భావిస్తే.. జనరల్ హౌజ్ నిర్ణయం తీసుకుంటుంది.'అని తెలిపారు.

చైనా కంపెనీల వల్ల మనకే లాభం..

చైనా కంపెనీల వల్ల మనకే లాభం..

బీసీసీఐ మాత్రం ప్రజల భావోద్వేగాలతో చైనా కంపెనీల ఒప్పందాలపై నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఇక భారత క్రికెట్‌కు బంగారు బాతులాంటి ఐపీఎల్‌ను చైనా కంపెనీ అయిన వివో స్పాన్సర్‌షిప్‌ చేస్తోంది. మరోవైపు టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఇటీవలి వరకు మరో చైనా కంపెనీ అయిన ‘ఒప్పో' వ్యవహరించగా... ఇప్పుడున్న బైజూస్‌లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో అనుబంధం కొనసాగించడంపై వస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సమాధానమిచ్చారు. ‘వివో' వల్లే మనకే లాభం తప్ప చైనాకు కాదని ఆయన స్పష్టం చేశారు.

ఎందుకు ఎగిరిపడుతున్నారు.. జయవర్ధనే, సంగక్కరలను ప్రశ్నించిన లంక మాజీ మంత్రి

Story first published: Sunday, June 21, 2020, 11:50 [IST]
Other articles published on Jun 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+