
ఆ మ్యాచ్ చూసే..
అండర్-19 వరల్డ్క్పలో భారత్ను విజేతగా నిలబెట్టిన తర్వాత.. 2008లో కోహ్లీ టీమిండియాకు ఎంపియ్యాడు. అయితే, విరాట్లోని ప్రతిభను చూసే అతడిని భారత జట్టుకు ఎంపిక చేసినట్టు వెంగ్సర్కార్ చెప్పాడు.‘కోల్కతా వేదికగా బాంబేతో జరిగిన అండర్-16 మ్యాచ్లో ఢిల్లీకి చెందిన కోహ్లీ ఆటను గమనించా. అప్పుడు అతడికి 15 ఏళ్లు. ఆ మ్యాచ్ల్లో కోహ్లీ ఆట ఆకట్టుకుంది. అతని కెప్టెన్ తేజస్వీ యాదవ్'అని ‘స్పోర్ట్స్ కిదా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్సర్కార్ చెప్పాడు.

అండర్-19 ప్రపంచకప్ గెలవడంతో..
‘అండర్-19 వరల్డ్కప్లో కోహ్లీ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది. అ టోర్నీలో పరుగులు చేయడంతోపాటు జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీ జరిగింది. అందులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రతి ఏడాదీ పాల్గొంటాయి. అప్పుడు సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న నేను.. ఈ టోర్నీలో ఆకట్టుకొనే ప్రదర్శన చేసిన వాళ్లకు టీమిండియాలో తప్పకుండా చోటుకల్పించాలని ముందే నిర్ణయించుకున్నా. ముఖ్యంగా అండర్-23 క్రికెటర్లలో విరాట్ను ఎంపిక చేశాను'అని వెంగ్సర్కార్ గుర్తు చేసుకున్నాడు. కివీస్ ఎమర్జింగ్ ప్లేయర్స్ టీమ్తో భారత ఎమర్జింగ్ ప్లేయర్స్ మ్యాచ్ జరిగినప్పుడే కోహ్లీ భవిష్యత్ ఖరారైందన్నాడు.

సెంచరీతో చెలరేగాడు..
‘న్యూజిలాండ్తో జరిగిన ఆ మ్యాచ్ను చూశా. గ్లేన్ టర్నర్, గ్రేగ్ చాపెల్ కూడా నాతో మ్యాచ్కు హాజరయ్యారు. అప్పుడు ఆస్ట్రేలియా-ఏ జట్టును చాపెల్ పర్యవేక్షిస్తున్నాడు. ఆ మ్యాచ్లో కివీస్ 240 లేక 250 పరుగులు చేసిందనుకుంటా( సరైన స్కోర్ 248/6). విరాట్ ఓపెనింగ్ చేస్తానని అడిగాడు. అతను ఆ మ్యాచ్లో 123( చేసింది 120) పరుగులతో అజేయంగా నిలిచాడు. అతను చేసిన పరుగులు నాకింకా గుర్తున్నాయి. ఆ మ్యాచ్లో ప్రతీ బంతిని నేను చూశాను'అని ఈ భారత మాజీ కెప్టెన్ తెలిపాడు.

అప్పుడే అనుకున్నా..
‘సెంచరీ అయిన తర్వాత కూడా విరాట్ వికెట్ ఇచ్చుకోలేదు. సూపర్ బ్యాటింగ్తో అద్భుత విజయాన్నందించాడు. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అప్పుడే ఈ కుర్రాడు భారత క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తాడనుకున్నా. ప్రపంచ క్రికెట్నే శాసిస్తాడని భావించా. ఎందుకంటే అతను మానసికంగా చాలా పరిణితి చెందినట్లు కనిపించాడు. వెంటనే అతన్ని భారత జట్టుకు ఎంపిక చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీకందరికి తెలిసిందే'అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications

రోహిత్ సెంచరీతో చెలరేగిన వేళ.. పాక్ను పాతరేసిన భారత్!










