
నా ఫేవరేట్ క్రికెటర్..
ఇక మహీ సాధా సీదాగా వీడ్కోలు పలకడం బాలేదని అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్చానెల్లో మాట్లాడిన సక్లైన్ ముస్తాక్.. మహీపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రస్తుత స్థితికి ధోనీనే కారణమని కొనియాడాడు. ప్రతీ క్రికెటర్కి జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదని ముస్తాక్ అన్నాడు. అలాగే ధోనీ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి అంటూ ప్రశంసించాడు.

నూటికి ఒక్కరు..
‘చూడటానికి మహీ ఎంత ప్రశాంతంగా కనిపించినా అతడు చాలా ప్రభావితం చేస్తాడు. ధోనీ అసాధారణ ఆటగాడు. ఇలాంటి వారు నూటికి ఒక్కరుంటారు. మహీ సాధించిన పేరూ, గౌరవం చరిత్రలో అలా నిలిచిపోతుంది. భారత జట్టు ఇప్పుడున్న స్థితికి అతడే పెద్ద కారణం. అలాగే ధోనీని అనుకరించి, అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా ధోనీని చివరి మ్యాచ్లో చూడాలనుకుంటారు.

ఆగలేక మాట్లాడుతున్నా..
నేనెప్పుడూ సానుకూల అంశాలు మాత్రమే మాట్లాడుతాను. నెగటివిటీని స్ప్రెడ్ చేయను. ఎవరిమీదా తప్పుగా మాట్లాడను. కానీ ధోనీ విషయంలో మాత్రం ఆగలేక ఇలా స్పందించాల్సి వస్తుంది. బీసీసీఐ ధోనీ వీడ్కోలు విషయంలో సరిగా ప్రవర్తించలేదు. అంత గొప్ప ఆటగాడికి సరైన పద్ధతిలో వీడ్కోలు పలకలేదు. ఇది ముమ్మాటికి బీసీసీఐ వైఫల్యమే. అతని వీడ్కోలు ఇలా ఉండాల్సింది కాదు. ఇది నా మనసులో నుంచి వచ్చిన మాట. ధోనీ కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

ఇలా అంటున్నందుకు సారీ బీసీసీఐ..
ఇలా అంటున్నందుకు బీసీసీఐకి క్షమాపణలు. కానీ మీ తీరుతో నేను బాధపడ్డా. ప్రతీ క్రికెటర్ కూడా గొప్పగా వీడ్కోలు అందుకోవాలనుకుంటాడు. ఆ విషయంలో ధోనీ కూడా అతీతుడు కాదు. అతని భవిష్యత్తు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. కానీ ధోనీ విషయంలో మేమంతా పశ్చాతపపడేది ఏదైనా ఉందంటే అది వీడ్కోలు మ్యాచ్ ఆడకపోవడమే. ప్రతి ధోనీ అభిమాని ఈ విషయంలో రిగ్రెట్ అవుతారు. ధోనీ భారత జెర్సీలో చివరి మ్యాచ్ ఆడితే చాలా సంతోషంగా ఫీలవుతా'అని సక్లైన్ ముస్తాక్ చెప్పుకొచ్చాడు.
మీకేమైనా పిచ్చా.. రోహిత్, ధోనీ ఫ్యాన్స్ ఫైటింగ్పై సెహ్వాగ్ ఫైర్!


Click it and Unblock the Notifications
