
దెబ్బతీసిన అండర్సన్..
ఓవర్నైట్ స్కోరు 24/3తో మూడో రోజు ఆదివారం ఆట కొనసాగించిన పాక్ను ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్ (5/56), బ్రాడ్ (2/40) దెబ్బ తీశారు. అండర్సన్ ధాటికి పాక్ ఓ 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అండర్సన్ ధాటికి ఆ జట్టు టాపార్డర్ పెవిలియన్కు క్యూ కట్టింది. ఫస్ట్ సెంచరీ హీరో ఓపెనర్ షాన్ మసూద్(4), మరో ఓపెనర్ అబిద్ అలీ(1), నిలకడకు మారు పేరైన బాబర్ అజామ్(11), అసద్ షఫీక్(5), ఫవాద్ అలామ్(21) దారుణంగా విఫలమయ్యారు.

అజర్, రిజ్వాన్ పోరాటం.
ఈ క్లిష్ట స్థితిలో కెప్టెన్ అజర్ అలీ, రిజ్వాన్ అత్యుత్తమ ఆటతీరుతో కదం తొక్కారు. సెకండ్ సెషన్ మొత్తం ఆధిపత్యం చూపెట్టారు. ఈ క్రమంలో అజర్ అలీ (141 నాటౌట్; 21 ఫోర్లు) కెరీర్లో 17వ టెస్టు సెంచరీ చేయడంతోపాటు 6 వేల పరుగుల మైలురాయిని దాటాడు. మరోవైపు రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆరో వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ఈ జంటను వోక్స్ విడదీశాడు. కీపర్కు క్యాచ్ ఇచ్చి రిజ్వాన్ వెనుదిరిగాడు.

చేజారిన క్యాచ్లు..
అయితే పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఆండర్సన్ వేసిన రెండు ఓవర్లలో మూడు క్యాచ్లు మిస్ కావడంతో అతడి 600 వికెట్లు పూర్తి కాలేదు. ఈ ఘనతను అతను ఇంకా రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. చివర్లో బ్రాడ్ దెబ్బకు పాక్ టెయిలండర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. యాసిర్ షా(20), షాహిన్ షా అఫ్రిది(3), నసీమ్ షా(0) ఓవర్ల వ్యవధిలోనే ఔటయ్యారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా.. పాకిస్థాన్ను ఓటమి నుంచి తప్పించాలంటే వరణుడే కరుణించాలి.
కోహ్లీ ఎవడైతే నాకేంటి.. ఎవడు నాపై ఆధిపత్యం చెలాయించవద్దు: విండీస్ పేసర్


Click it and Unblock the Notifications












