Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇషాన్ కిషన్ ఊచకోత.. 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా ఈస్ట్ జోన్!

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ చరిత్ర సృష్టించింది. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్‌ను ఓడించి 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. వారి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఈస్ట్ జోన్‌ను ఛాంపియన్‌గా నిలిపింది. ఆసక్తకర విషయం ఏమిటంటే.. 13 ఏళ్ల క్రితం ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన దులీప్ ట్రోఫీ టైటిల్‌ను కూడా ఈస్ట్ జోన్ గెలుచుకుంది. మొత్తంగా ఈస్ట్ జోన్‌కు ఇది మూడో దులీప్ ట్రోఫీ టైటిల్.

ఇషాన్ కిషన్.. ఇదేం తొండాట!

ఇషాన్ కిషన్.. ఇదేం తొండాట!

మ్యాచ్ ముగియగానే ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకుని మ్యాచ్ ముగింపును సూచించారు. అనంతరం ఈస్ట్ జోన్ ఆటగాళ్లు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ , యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చేతుల్లో వికెట్లతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. జట్టు మొత్తం స్టేడియం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రేక్షకులకు అభివాదం చేసింది.

Duleep Trophy 2026 Ishan Kishan Lead East Zone Champions After 13 Years defeating South Zone Details

హీరోగా నిలిచిన ఇషాన్ కిషన్
ఈస్ట్ జోన్ విజయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. రెడ్-బాల్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇషాన్ కిషన్ క్రమంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఒక్కడే 270 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 334 బంతులు ఎదుర్కొని 522 నిమిషాల పాటు క్రీజులో నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ పరుగుల పరంగానే కాకుండా, టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన ఓర్పు, పోరాట స్ఫూర్తిని కూడా ప్రదర్శించింది. కండరాల నొప్పుల కారణంగా ఇషాన్ 250 పరుగుల వద్ద గాయపడి రిటైర్ అయ్యాడు. అయినప్పటికీ ఇషాన్ కిషన్ పట్టు వదలలేదు. తిరిగి మైదానంలోకి వచ్చి స్కోరును 270కి చేర్చాడు. కానీ కెప్టెన్ కథ అక్కడితో ముగియలేదు. ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా కీలకమైన 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఫైనల్‌లో ఇషాన్ మొత్తం పరుగులు 350కి చేరి, మ్యాచ్‌లో అత్యంత ఆకట్టుకున్న బ్యాటర్‌గా నిలిచాడు.

దులీప్ ట్రోఫీ ఫైనల్ చివరి రోజున మరో పేరు వార్తల్లో నిలిచింది. మహమ్మద్ కోనన్ ఖురేషి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఖురేషి ఆటతీరు చూస్తే అతను చాలా కాలంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడుతున్నట్లు అనిపించింది. తీవ్ర ఒత్తిడితో సాగిన ఈ మ్యాచ్‌లో అతని ఆత్మవిశ్వాసం, బ్యాటింగ్ శైలి స్పష్టంగా కనిపించాయి. అతను తన సెంచరీని పూర్తి చేసి, చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. టైటిల్ దాదాపు ఖాయమైన సమయంలో ఈస్ట్ జోన్ తరఫున ఈ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఖురేషి తన అరంగేట్రాన్ని చిరస్మరణీయం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేశాడు.

ఇషాన్ కిషన్ అరుదైన ఘనత.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Also Read

ఇషాన్ కిషన్ అరుదైన ఘనత.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన మహమ్మద్ సిరాజ్
ఈస్ట్ జోన్ ను అడ్డుకునేందుకు సౌత్ జోన్‌కు చెందిన మహమ్మద్ సిరాజ్ శాయశక్తులా కృషి చేశాడు. మ్యాచ్ ఫలితం దాదాపుగా తేలిపోయినప్పటికీ, సిరాజ్ తన సర్వశక్తులూ ఒడ్డి పోరాడాడు. సిరాజ్ చెన్నైలోని కఠినమైన, సవాలుతో కూడిన పరిస్థితులలో వరుసగా తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేశాడు . మ్యాచ్ ఫలితం తేలిపోయిన తర్వాత కూడా అతను బౌలింగ్ కొనసాగించడం అతని పోరాట స్ఫూర్తిని చాటింది. ఇదే ఫస్ట్-క్లాస్ క్రికెట్ గొప్పతనం. ఫలితం కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ, ఆటగాళ్లు చివరి బంతి వరకు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

13 ఏళ్ల నిరీక్షణకు తెర
13 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఈస్ట్ జోన్ ఆటగాళ్లు వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దులీఫ్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. . తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా వారు దక్షిణ జోన్‌ను అధిగమించి దులీప్ ట్రోఫీ 2026ను గెలుచుకున్నారు.ఇషాన్ కిషన్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. కెప్టెన్ బ్యాట్‌తో 350 పరుగులు చేయగా, అరంగేట్రం చేసిన కోనన్ ఖురేషి సెంచరీ సాధించాడు. సిరాజ్ చివరి వరకు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు కూడా జట్టు సంబరాల్లో తమ ఉనికిని చాటుకున్నారు.

దులీప్ ట్రోఫీ ఫైనల్ ముఖ్యాంశాలు
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో సౌత్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి, 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ ఈ విజయం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 388/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో, మొత్తం ఆధిక్యం 760 పరుగులకు చేరింది. మహమ్మద్ కోనన్ ఖురేషి అజేయంగా 116 పరుగులు చేశాడు. ఇది అతని రెండు మ్యాచ్‌ల ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో తొలి సెంచరీ. అతను అనుకుల్ రాయ్‌తో కలిసి ఏడవ వికెట్‌కు 150 పరుగులు జోడించాడు. ఈస్ట్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులు చేసి అద్భుతంగా సారథ్యం వహించాడు. మహమ్మద్ షమీ తన 100వ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో ప్రభావం చూపాడు. మరోవైపు సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది.

Story first published: Thursday, September 10, 2026, 16:45 [IST]
Other articles published on Sep 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+