ఆస్ట్రేలియా ప్లేయర్లు దూరం?
ఇక ఈ ప్రాణాంతకవైరస్ కారణంగా ప్రపంచమే మూతపడుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్కు దూరమయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకున్నా.. ఆసీస్ ప్లేయర్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటారని అక్కడి మీడియా తెలిపింది.
దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఐపీఎల్లో ఆడే విదేశీ ఆటగాళ్లలో ఎక్కువ మంది ఆసీస్ ఆటగాళ్లే కావడం గమనార్హం. డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్), పాట్ కమిన్స్ (కోల్కతా నైట్రైడర్స్), స్టీవ్స్మిత్ (రాజస్థాన్ రాయల్స్), గ్లెన్ మాక్స్వెల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్), అరోన్ ఫించ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఇలా ఆ దేశ క్రికెటర్లు ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
హైదరాబాద్ ఫ్యాన్స్కు చల్లని కబురు..
ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఒకవైపు.. ఆసీస్ ప్లేయర్లు ఆడుతారా లేదా? అనే సందేహం మరోవైపు ఉన్న పరిస్థితుల్లో సన్రైజర్స్ ఫ్యాన్స్కు చల్లని కబురు అందింది. ఐపీఎల్ జరిగితే డేవిడ్ వార్నర్ ఆడుతాడని అతని మేనేజర్ జేమ్స్ తాజాగా స్పష్టం చేశాడు. జరగకపోతే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయన్నాడు.
‘ఐపీఎల్ జరిగితే భారత్ వచ్చేందుకు డేవిడ్ వార్నర్ ప్రణాళికలు రచిస్తున్నాడు. పరిస్థితులు ఒక్కసారిగా మారితే మీరు(ఆస్ట్రేలియా మీడియా) మనసు మార్చుకుటారు. ఇదంతా ఒక్క గంటలో కూడా జరగవచ్చు'అని వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ ఓ చానెల్కు తెలిపారు. ఇక వార్నర్తో పాటు బిల్లీ స్టాన్లేక్, మిచెల్ మార్ష్లు కూడా సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు.
ఆటలేంది మళ్లీ ఆడొచ్చు.. కానీ ఆరోగ్యం..
సన్రైజర్స్ కీలక ప్లేయర్ వార్నర్..
సన్రైజర్స్ జట్టులో కీలక ఆటగాడు డేవిడ్ వార్నర్. ఈ విషయం ప్రతీ అభిమానికి తెలిసిందే. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఈ డాషింగ్ ఓపెనర్ రికార్డ్సే అతనేంటో చెబుతాయి. 126 మ్యాచ్లు ఆడిన వార్నర్ 4,706 పరుగులు చేశాడు.
ఇందులో 4 సెంచరీలు 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ప్రతీ సీజన్లో వార్నర్ 500కు పైగా రన్స్ చేసి రికార్డు సృష్టించాడు. 2015.2017,2019 సీజన్లలో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 2016లో అద్భుత కెప్టెన్సీతో జట్టుకు టైటిల్ అందించాడు. బాల్ ట్యాంపరింగ్తో 2018 సీజన్కు దూరమవడంతో పాటు కెప్టెన్సీ కోల్పోయిన ఈ విధ్వంసకర ఓపెనర్ ఈ సీజన్లో మళ్లీ సారథిగా ఎంపికయ్యాడు.