For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ ఇదేం జట్టు.. నీ కెప్టెన్సీ తీరు బాలేదు.. అతను మ్యాచ్ విన్నరని ఎవడన్నాడు

 Aakash Chopra lashes out at KXIP management and KL Rahul captaincy

న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆఖరి ఓవర్‌ను స్పిన్నర్‌తో వెయించడాన్ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తప్పుబట్టగా.. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పంజాబ్ తుది జట్టు ఎంపిక బాలేదని విమర్శించాడు. ఆ కారణంగానే పంజాబ్ గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడిపోతోందని తెలిపాడు. అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో కింగ్స్ పంజాబ్ 48 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్‌ను విశ్లేషించిన ఆకాశ్ చోప్రా.. రాహుల్ కెప్టెన్సీ, టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయాలను తప్పుబట్టాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్‌ నీషమ్‌ 'మ్యాచ్‌ విన్నర్' కాదని, ముజీబ్ ఉర్‌ రెహ్మాన్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వని ఏకైక టీమ్ ఇదేనని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అతని వల్ల ఉపయోగం ఏంటి?

అతని వల్ల ఉపయోగం ఏంటి?

‘ప్రధాన విషయం ఎంటంటే కింగ్స్ పంజాబ్‌ సరైన జట్టుతో ఆడటం లేదు. తుది జట్టులో ముజీబ్‌ ఉర్ రెహ్మాన్‌కు చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ఇదే. అతనికి బదులు ఓవర్‌సీస్ ఆటగాళ్ల కోటాలో జిమ్మీ నీషమ్‌ను ఆడిస్తున్నారు. అటు పవర్‌ప్లే, ఇటు డెత్‌లో అతడు బౌలింగ్‌ చేయలేడు. ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే అతడు మ్యాచ్‌ విన్నర్ కాదు. నాలుగు, ఐదు స్థానాల్లో భారీ షాట్లు ఆడి గెలిపించలేడు. మరి అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకుంటున్నారు? గెలిపించలేని ఆటగాడిని ఆడించడం వల్ల లాభమేంటి?' అని ఆకాశ్‌ ప్రశ్నించాడు.

షమీ డెత్ బౌలరా?

షమీ డెత్ బౌలరా?

మహ్మద్‌ షమీని డెత్ బౌలర్‌గా ఉపయోగించటాన్ని కూడా చోప్రా తప్పుబట్టాడు. అతను టీమిండియాకు తొలి ప్రాధాన్యం ఉన్న డెత్‌బౌలర్‌ కాదని గుర్తు చేశాడు. షెల్డన్ కాట్రెల్‌తో ముందుగానే బౌలింగ్ చేయించడం కూడా సరైంది కాదన్నాడు. ‘ముంబై ఇండియన్స్‌తో 15 ఓవర్లకు ముందే షెల్డన్ కాట్రెల్‌ కోటాను పూర్తి చేయించారు. ఇది ఏ రకమైన బౌలింగ్‌? మరి డెత్‌లో ఎవరితో వేయిస్తారు?కాట్రెల్‌ను మినహాయిస్తే మిగిలింది నీషమ్‌, కృష్ణప్ప గౌతమ్‌, మహ్మద్ షమీ. టీమిండియాకు కూడా షమీ తొలి ప్రాధాన్య డెత్‌ బౌలర్‌ కాదు. అందుకే 20వ ఓవర్‌ను గౌతమ్‌కు ఇచ్చారు. ఈ రోజుల్లో అనుభవజ్ఞులైన సునీల్ నరైన్‌, రవిచంద్రన్ అశ్విన్‌, హర్భజన్ సింగ్‌లకు కూడా ఆఖరి ఓవర్‌ బంతి ఇవ్వడం లేదు కదా? కనీసం ఆ సోయి కూడా లేకుంటే ఎలా' అని చోప్రా ఘాటుగా వ్యాఖ్యానించారు.

చివరి 6 ఓవర్లలోనే 104..

చివరి 6 ఓవర్లలోనే 104..

నిజానికి పంజాబ్ బౌలర్లు పొదుపుగానే బౌలింగ్ చేశారు. 14వ ఓవర్ ముగిసే సరికి ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు మూడు వికెట్లుకు 87 పరుగులు మాత్రమే. ఆ తరువాతే గేరు మార్చిన ముంబై ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 104 పరుగులను పిండుకున్నారు. షమీ వేసిన 17వ ఓవర్‌లో 5 పరుగులు మినహా మిగతా 5 ఓవర్లలో బౌలర్లకు చుక్కులు చూపించారు. 15వ ఓవర్‌లో 15 పరుగులు, 16వ ఓవర్‌లో 22, 18వ ఓవర్‌లో 18, 19వ ఓవర్‌లో 19 పరుగులు చేసిన ముంబై బ్యాట్స్‌మెన్.. చివరి ఓవర్‌లో 25 పరుగులు పిండుకున్నారు.

పొలార్డ్, పాండ్యా విధ్వంసం..

పొలార్డ్, పాండ్యా విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) ధాటిగా ఆడగా... పొలార్డ్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్‌) విరుచుకుపడ్డారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. నికోలస్‌ పూరన్‌ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మినహా అంతా విఫలమయ్యారు.

ఓ ఐసీసీ.. ఇదేం డీఆర్‌ఎస్ రూల్? ఎట్టెట్టా.. ఆ సింగిల్ కౌంట్ కాదు? ఇంత అన్యాయమా?

Story first published: Friday, October 2, 2020, 16:33 [IST]
Other articles published on Oct 2, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+