
మయాంక్ను ఎందుకు పంపలేదు..?
సూపర్ ఓవర్లో అద్భుత ఫామ్లో ఉన్న మయాంక్ అగర్వాల్ను కాకుండా కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, గ్లేన్ మ్యాక్స్వెల్ను పంపించి ఆ జట్టు ఘోర తప్పిదం చేసిందని అభిప్రాయపడ్డాడు. తాను కామెంట్రీ బాక్స్ నుంచి మయాంక్ అగర్వాల్ను పంపించాలని మొత్తుకున్నానని తెలిపాడు. ఈ పొరపాటే పంజాబ్ ఓటమికి కారణమైందన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్ను విశ్లేషించిన చోప్రా.. పంజాబ్ టీమ్మేనేజ్మెంట్ తీరును తప్పుపట్టాడు. ‘మ్యాచ్ తమవైపు ఉన్న పరిస్థితుల్లో కింగ్స్ పంజాబ్ చేసిన పనికి నా మదిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడాడు. కానీ అతన్ని సూపర్ ఓవర్లో ఎందుకు పంపలేదో నాకు అర్థం కాలేదు.'అని చోప్రా పేర్కొన్నాడు.

కామెంట్రీ బాక్స్ నుంచి అరిచా..
పంజాబ్ గెలుపు కోసం ఒంటి పోరాటం చేసిన మయాంక్ అగర్వాల్ను కాదని కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మ్యాక్స్వెల్ను సూపర్ ఓవర్లో ఆడించడంపై చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కామెంట్రీ బాక్స్ నుంచి మయాంక్ పంపించాలని అరిచానని కూడా చెప్పుకొచ్చాడు. ‘ మయాంక్ను సూపర్ ఓవర్లో ఆడించాలని మొత్తుకున్నా. అతనే సూపర్ బ్యాటింగ్తో దూకుడుగా కనిపించాడు. కానీ పంజాబ్ మాత్రం విఫలమైన నికోలస్ పూరన్, రాహుల్, మ్యాక్స్వెల్ను పంపించి మూల్యం చెల్లించుకుంది'అని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

బేబీ ఓవర్ చేసారు..
పంజాబ్ మేనేజ్మెంట్ అనాలోచిత నిర్ణయంతో సూపర్ ఓవర్.. కాస్త బేబీ ఓవర్ అయిందని విమర్శించాడు. వారు పంపించిన బ్యాట్స్మెన్ కనీసం ఆరు బంతులు ఆడలేకపోయారని, మూడు బంతుల్లోనే చేతులెత్తేసారన్నాడు. రెండు వికెట్లను సమర్పించుకొని సూపర్ ఓవర్ను బేబీఓవర్గా మర్చాడని అసహనం వ్యక్తం చేశాడు. ‘పంజాబ్ సూపర్ ఓవర్ను బేబీ ఓవర్గా మార్చింది. మూడు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది. గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకున్నారు'అని చోప్రా కామెంట్ చేశాడు. ఇక ఐపీఎల్ 2020 సీజన్లో చోప్రా హిందీ కామెంటేటర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అటు స్టోయినీస్..ఇటు మయాంక్
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 120 పరుగులకే పరిమితమవుతుందా? అనిపించింది. కానీ చివర్లో స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించడంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆఖరి ఓవర్లోనే ఆ జట్టు 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 89) వీరోచిత ఇన్నింగ్స్తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారి తీసింది. ఓటమి దశ నుంచి గెలుపు ముంగిట నిలిపిన మయాంక్ ఆ లాంఛనాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాడు.


Click it and Unblock the Notifications

ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ చెత్త రికార్డు!