For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ జరుగుతుంది సరే.. రూ.3 వేల కోట్లు వస్తాయా? ఆందోళనలో స్టార్ గ్రూప్!

50 Days 3000 Cr, how feasible is Star India’s IPL 2020 target?


న్యూఢిల్లీ:
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ జరగకపోతే భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ)కి దాదాపు నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా లీగ్‌ను జరపాలన్న కృతనిశ్చయంతో ఉన్న బోర్డు ఆ దిశగా ప్రణాళికలు రచించింది. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించేందుకు సన్నహకాలు మొదలుపెట్టింది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. కానీ వేల కోట్లు కుమ్మరించి భారత క్రికెట్‌ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్‌ గ్రూప్‌ పరిస్థితే ఆగమ్యగోచరంగా మారింది.
 రూ.3వేల కోట్ల లాభాలు..

రూ.3వేల కోట్ల లాభాలు..

స్టార్ గ్రూప్ అంచనా ప్రకారం ఈ లీగ్‌ ద్వారా రూ.3 వేల కోట్ల లాభాలు తమ ఖాతాలో వేసుకుంటుందా? అంటే సందేహమే. వాస్తవానికి మార్చిలో తొలిసారి లీగ్‌ వాయిదా పడకముందు.. స్టార్‌ తమకు సంబంధించిన వ్యాపార లావాదేవీలను 75శాతం పూర్తి చేసుకుంది. దీంతో కచ్చితంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసింది. కానీ గత ఐదు నెలలుగా కొవిడ్‌-19 విశ్వరూపానికి దేశంలో మార్కెట్‌ పరిస్థితి తలకిందులైంది. ప్రజలతో పాటు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఆర్థికంగా కుదేలయ్యాయి.

 అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ..

అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ..

ఈ తరుణంలో ఐపీఎల్‌లాంటి భారీ లీగ్‌పై డబ్బులు కుమ్మరించేందుకు కంపెనీలు ముందుకు రాకపోవచ్చని స్టార్‌, డిస్నీ ఇండియా చైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌ కూడా అభిప్రాయపడ్డారు. ఏ కంపెనీకైనా తమ ఉత్పత్తుల ప్రచారానికి ఐపీఎల్‌ను మించిన టోర్నీ లేదు. కంపెనీలు యాడ్స్‌కే వందల కోట్లు ఖర్చుపెట్టేవి. కానీ కరోనా దెబ్బకు పరిస్థితులు మారాయి. టోర్నీ జరిగే సెప్టెంబర్‌లోగా మార్కెట్‌ పుంజుకోవడం అనుమానమే.

ఒప్పందాలు రద్దు..

ఒప్పందాలు రద్దు..

గతంలో స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో కొన్ని ఇప్పటికే వైదొలగగా, మరికొన్ని రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఐపీఎల్‌ తుది షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించకపోవడం కూడా స్టార్‌కు ఇబ్బందిగా మారింది. ఇంతకుముందు మూడు నెలల ముందుగానే తమ ప్రచార కార్యకలాపాల్లోకి దిగేది. కానీ ప్రస్తుతం ఇంకా ఎలాంటి మార్కెటింగ్‌ పనులూ చేపట్టలేదు.

దెబ్బకొట్టిన చైనా వ్యతిరేక ప్రచారం

దెబ్బకొట్టిన చైనా వ్యతిరేక ప్రచారం

కరోనా సంక్షోభానికి తోడు ప్రజల్లో నెలకొన్న చైనా వ్యతిరేక ప్రచారం కూడా దెబ్బకొట్టనుంది. ఒప్పో, వివోతో పాటు మరికొన్ని సంస్థలు ఐపీఎల్‌కు రెగ్యులర్‌గా ప్రకటనలిస్తుంటాయి. ఈ సమయంలో వీరి నుంచి దక్కే ఆదాయం కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(జీసీ) సమావేశం తర్వాత లీగ్ నిర్వహణపై బోర్డు క్లారిటీ ఇవ్వనుంది. లీగ్ విధివిధానాలకు సంబంధించి తయారు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)ను ఫ్రాంచైజీలకు బోర్డు అందజేయనుంది. ఫుల్ షెడ్యూల్ కూడా అప్పుడే రానుంది. ఇప్పటికే దీపావళి సీజన్ కలిసొచ్చేలా లీగ్‌ షెడ్యూల్‌ను రూపొందించాలని స్టార్ ఇండియా బీసీసీఐకి సూచించింది.

ఐపీఎల్ 2020 సీజన్‌ బరిలో మన తెలుగోళ్లు ముగ్గురే!

Story first published: Friday, July 31, 2020, 9:45 [IST]
Other articles published on Jul 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+