హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్లు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. 12 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు ఈ స్టార్ కపుల్ సిద్దమైందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. గత 48 గంటలుగా వారి విడాకుల గురించి అనేక రూమర్లు వస్తున్నా.. ఈ ఇద్దరూ స్పందించకుండా మౌనంగా ఉండటం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా చేసిన పోస్ట్లు, పరోక్ష వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తున్నాయి.
అయితే షోయబ్ మాలిక్ మోసం చేయడంతోనే సానియా మీర్జా ఈ కఠిన నిర్ణయం తీసుకుందనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. ఓ మోడల్తో షోయబ్ మాలిక్ పెట్టుకున్న వివాహేత సంబంధమే సానియా మీర్జా కాపురంలో నిప్పులు పోసాయని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం షోయబ్ మాలిక్కు సదరు మోడల్తో పరిచయమైందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఆమెతో చనువుగా దారి తీసిందనే ఈ రూమర్ సారంశం. ఆ మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం మానేసాడట. ప్రతీ విషయం సానియాతో షేర్ చేసుకునే మాలిక్.. ఈ వ్యవహారం మాత్రం దాచి పెట్టడట.
చివరకు మాలిక్ మోసాన్ని తెలుసుకున్న సానియా.. అతనికి దూరంగా వచ్చేసిందట. సానియా దూరంగా వచ్చినా.. ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం షోయబ్ మాలిక్ చేయలేదంట. దాంతో మరింత ఆగ్రహానికి గురైన సానియా మీర్జా తమ బంధాన్ని ముగించుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షోయబ్ మాలిక్ మోసాన్ని తట్టుకోలేకనే.. ఆమె తన కొడుకు ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి'కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే క్షణాలు'అంటూ క్యాప్షన్గా పేర్కొన్నట్లు అర్థమవుతోంది. ఆ తర్వాత 'ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది'అని సానియా పోస్ట్ చేసింది. ఇది కూడా షోయబ్ మాలిక్ మోసాన్ని ఉద్దేశించి చేసిందేనని ప్రచారం జరుగుతోంది.
అయితే సానియా మీర్జా-షోయబ్ మాలిక్లు మాత్రం ఇప్పటి వరకు తమ విడాకులపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు ఈ ప్రచారాల్లో ఎంతవరకు వాస్తవం ఉందో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఈ పుకార్లను వాళ్లను ఖండించకపోవడంతో.. మరిన్నీ వ్యాప్తిలోకి వస్తున్నాయనేవి మాత్రం వాస్తవం. మారి మౌనం మరిన్నీ సందేహాలకు దారి తీస్తోంది.