
బోపన్న జోడీ ముందంజ..
పురుషుల డబుల్స్లో భారత స్టార్ రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. క్రొయేషియా ప్లేయర్ ప్రాకో సుగోర్తో జోడీ కట్టిన అతను రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్లో బోపన్న-ఫ్రాంకో 6-4, 6-2తో బెంజిమన్ (జర్మనీ)-బాసిల్ష్వెలి (జార్జియా) జంటను ఓడించింది. తొలి సెట్లో ఒకసారి, సెకండ్ సెట్లో రెండు సార్లుప ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి ముందంజ వేసింది.

బార్టీ, సెరెనా ముందుంజ..
మహిళల సింగిల్స్లో ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ గట్టెక్కింది. తొలి రౌండ్లో బార్టీ 6-4, 3-6, 6-2తో అమెరికా అమ్మాయి బెర్నార్డా పెరాపై గెలిచింది. పెద్దగా ఇబ్బంది పడకుండానే తొలి సెట్ను గెలిచిన బార్టీ రెండో సెట్లో తడబడింది. మోకాలి గాయం బాధిస్తుండడంతో కోర్టులో కదలడానికి చాలా ఇబ్బంది పడింది. కాలికి కట్టు కట్టుకుని ఆడిన ఆమె 3-6తో సెట్ కోల్పోయింది. మూడో సెట్లో తీవ్ర ఒత్తిడిలో ఆడిన బార్టీ నెమ్మదిగా పుంజుకుంది. ఆరో గేమ్లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరుతో తర్వాత రెండు గేమ్లు కూడా సొంతం చేసుకుని సెట్తో పాటు మ్యాచ్ను దక్కించుకుంది. 2019లో ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన బార్టీ.. గతేడాది టోర్నీకి దూరమైంది.

సెరెనా శుభారంభం..
24వ గ్రాండ్ స్లామ్ టైటిల్పై గురిపెట్టిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ శుభారంభాన్ని అందుకుంది. ఏడో సీడ్ సెరెనా 7-6 (8/6), 6-2తో ఇరినా బెగు (రొమేనియా)పై గెలిచి రెండో రౌండ్కు చేరింది. ఐదో సీడ్ స్వితోలినా కూడా ముందంజ వేసింది. స్వితోలినా 6-2, 7-5తో బాబెల్ (ఫ్రాన్స్)ను ఓడించింది. మ్లదనోవిచ్ (ఫ్రాన్స్), సకారి (గ్రీస్) కూడా తొలి రౌండ్ అధిగమించారు. మ్లదనోవిచ్ 6-4, 6-0తో సిమిద్లోవా (స్లోవేకియా)ను ఓడించగా.. సకారి 6-4, 6-1తో జవాస్కా (ఉక్రెయిన్)పై నెగ్గింది. మరోవైపు అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్, ముగురుజ (స్పెయిన్) ఓడిపోయారు. తొలి రౌండ్లో వీనస్ 3-6, 1-6తో అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో చిత్తు కాగా.. పన్నెండో సీడ్ ముగురుజ 1-6, 4-6తో మార్టా (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.


Click it and Unblock the Notifications












