ఒలింపిక్ క్రీడలు చరిత్ర

టోక్యో 2021

2021 జూలై 23న ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ 2021 ఆగష్టు 8వ తేదీన ముగుస్తాయి. కరోనా కారణంగా ఏడాది పాటు ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. 32వ ఎడిషన్ ఒలింపిక్స్‌కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యం ఇస్తుండగా మొత్తంగా టోక్యోలో ఒలింపిక్స్ జరగడం ఇది రెండో సారి. ఈ ఏడాది మొత్తం 206 దేశాల నుంచి 11,238 మంది అథ్లెట్లు టోక్యో చేరుకున్నారు. టోక్యో 33 స్పోర్ట్స్‌లో 339 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఏడాది టోక్యోకు భారతదేశం అతిపెద్ద బృందాన్ని పంపింది. ఈ సంవత్సరం, 126 మంది భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటారు.

రియో 2016

2016 ఒలింపిక్స్ బ్రెజిల్ రాజధాని రియో డీ జనీరోలో ఆగష్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరిగాయి. 31వ ఒలింపిక్స్‌లో మొత్తం 11,238 మంది క్రీడాకారులు 207 దేశాల నుంచి 28 క్రీడలకు చెందిన 306 ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.2016 ఒలింపిక్స్‌లో అమెరికా 46 స్వర్ణాలు 37 రజత పతకాలు 38 కాంస్య పతకాలతో అగ్రస్థానంలో నిలవగా.. గ్రేట్ బ్రిటెయిన్ , చైనా , రష్యా, జర్మనీ దేశాలు వరుసగా రెండు, మూడు, నాలుగు ఐదవ స్థానాల్లో నిలిచాయి. రియో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 63 మంది పురుషులు ఉండగా 54 మంది మహిళలు ఉన్నారు. ఈ గేమ్స్‌లో భారత్ ఒక రజతం ఒక కాంస్య పతకాలతో సంతృప్తి పడాల్సి వచ్చింది. మహిళా షట్లర్ పీవీ సింధు రజత పతకం గెలవగా, మరో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలుచుకుంది.

లండన్ 2012

2012 ఒలింపిక్ గేమ్స్‌కు లండన్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 10768 అథ్లెట్లు 204 దేశాల నుంచి పాల్గొన్నారు. 2012 జూలై 27 నుంచి ఆగష్టు 12 వరకు లండన్‌లో ఈ క్రీడలు జరిగాయి. 26 క్రీడల నుంచి 302 మ్యాచ్‌లు ఈ ఒలింపిక్స్‌లో జరిగాయి. అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ తన పతక విజయాలతో క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. యునైటెడ్ స్టేట్స్ ఆ సంవత్సరం 104 పతకాలు సాధించగా ఇందులో 46 బంగారు పతకాలు ఉన్నాయి. 38 స్వర్ణ పతకాలతో మొత్తంగా 91 పతకాలు సాధించి చైనా రెండవ స్థానంలో నిలిచింది. 29 స్వర్ణ పతకాలు 17 వెండి పతకాలు 19 కాంస్య పతకాలతో మొత్తంగా 65 పతకాలు సాధించి గ్రేట్ బ్రిటెయిన్ మూడవ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి మొత్తం 13 క్రీడల్లో 83 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 6 మెడల్స్‌ను సాధించింది. ఇందులో రెండు రజత పతకాలు నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. షూటర్ విజయ్ కుమార్ మరియు రెజ్లర్ సుశీల్ కుమార్‌లు రజత పతకాలు గెలవగా... షూటర్ గగన్ నారంగ్ , రెజ్లర్ యోగేశ్వర్ దత్, మహిళా బాక్సర్ మేరీ కోమ్ మరియు మహిళా షట్లర్ సైనా నెహ్వాల్‌లు కాంస్య పతకాలు గెలిచారు.

బీజింగ్ 2008

2008 ఒలింపిక్స్ చైనా రాజధాని బీజింగ్‌ నగరంలో జరిగాయి. 2008 ఆగష్టు 8వ తేదీ నుంచి ఆగష్టు 24వ తేదీ వరకు జరిగాయి. 204 దేశాల నుంచి 10942 మంది క్రీడాకారులు 28 క్రీడలకు చెందిన 302 ఈవెంట్స్‌లో పాల్గొన్నారు.తొలిసారిగా చైనాలో ఒలింపిక్స్ జరిగాయి. ఇక మొత్తం 37 వెన్యూల్లో ఈ గేమ్స్ నిర్వహించారు. అయితే ఈక్వెస్ట్రియాన్ ఈవెంట్స్ మాత్రం హాంకాంగ్‌లో జరిగాయి. ఎవరూ ఊహించనంతగా బీజింగ్ ఒలింపిక్స్‌లో 87 దేశాలు కనీసమంటే ఒక పతకం గెల్చుకున్నాయి. ఆతిథ్య దేశం చైనా పతకాల పట్టికలో 48 స్వర్ణ పతకాలతో మొత్తంగా 100 పతకాలు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 112 మెడల్స్‌తో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది.అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ 8 బంగారు పతకాలను సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు గెలిచిన వ్యక్తిగా కొత్త చరిత్ర సృష్టించాడు మైఖేల్ ఫెల్ప్స్. ఇక భారత్ ఒక స్వర్ణ పతకం రెండు కాంస్య పతకాలతో సరిపెట్టకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ ఈవెంట్‌లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకం సాధించగా రెజ్లర్ సుశీల్ కుమార్ మరియు బాక్సర్ విజేంద్ర సింగ్‌లో కాంస్య పతకం సాధించారు.

ఏథెన్స్ 2004

గ్రీస్ రాజధాని ఏథెన్స్, 2004 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 13 నుండి 29 వరకు జరిగాయి. 28 వ ఒలింపిక్స్‌లో 201 దేశాల నుండి 10,625 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. ఏథెన్స్‌లో 28 క్రీడల నుండి 301 మ్యాచ్‌లో క్రీడాకారులు పోటీపడ్డారు. యునైటెడ్ స్టేట్స్ ఆ సంవత్సరం 101 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా.. ఇందులో 36 బంగారు పతకాలు ఉన్నాయి. చైనా 32 స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచింది. షూటింగ్ స్టార్ రాజ్యవర్ధన్ రాథోడ్ 2004 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. భారతదేశ చరిత్రలో ఇది తొలి వ్యక్తిగత ఒలింపిక్ పతకం. ఆ సంవత్సరం, 73 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు.

సిడ్నీ 2000

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, 2000 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఒలింపిక్ క్రీడలు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 1 వరకు జరిగాయి. 27 వ ఒలింపిక్స్‌లో 199 దేశాల నుంచి 10,651 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. సిడ్నీలో 28 క్రీడల నుండి 300 ఈవెంట్స్‌లో క్రీడాకారులు పోటీపడ్డారు. ఆ సంవత్సరం సుమారు 37 బంగారు పతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. 32 స్వర్ణాలతో రష్యా రెండో స్థానంలో, 28 స్వర్ణాలతో చైనా మూడో స్థానంలో నిలిచాయి. భారత మహిళల వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి 2000 ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఆ సంవత్సరం, 65 మంది భారతీయ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు.

అట్లాంటా 1996

అమెరికన్ నగరం అట్లాంటా 1996 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. జూలై 19 నుండి ఆగస్టు 4 వరకు ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 26 వ ఒలింపిక్స్‌లో 197 దేశాల నుంచి మొత్తం 10,320 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. అట్లాంటాలో 26 క్రీడల నుండి 271 ఈవెంట్స్‌లో క్రీడాకారులు పోటీపడ్డారు. ఆ సంవత్సరం 44 బంగారు పతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రష్యా 26 స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచింది. లియాండర్ పేస్ 1996 ఒలింపిక్స్‌లో భారతదేశానికి కాంస్య పతకం సాధించాడు.

బార్సెలోనా 1992

స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరం 1992 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. జూలై 25 నుండి ఆగస్టు 9 వరకు ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 25 వ ఒలింపిక్స్‌లో 169 దేశాల నుంచి మొత్తం 9,356 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. బార్సిలోనా గేమ్స్‌లో 25 క్రీడల నుండి 257 ఈవెంట్స్‌లో క్రీడాకారులు పోటీపడ్డారు. 32 ఏళ్ల పాటు నిషేధంకు గురైన దక్షిణాఫ్రికా కూడా తొలిసారిగా బార్సిలోనా ఒలింపిక్స్‌లో పాల్గొనింది.ఆ సంవత్సరం మాజీ సోవియట్ రిపబ్లిక్‌తో కూడిన యునైటెడ్ జట్టు 45 బంగారు పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశం 53 మంది అథ్లెట్లను పంపింది కానీ ఒక్క పతకం కూడా ఆ దేశానికి రాలేదు.

సియోల్ 1988

దక్షిణ కొరియా నగరం సియోల్ 1988 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఒలింపిక్ క్రీడలు సెప్టెంబర్ 17 నుండి ఆగస్టు 2 వరకు జరిగాయి. 24 వ ఒలింపిక్స్‌లో 159 దేశాల నుంచి మొత్తం 8,391 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. సియోల్ 25 క్రీడల నుండి 237 ఈవెంట్స్‌లో క్రీడాకారులు పోటీపడ్డారు. ఆ సంవత్సరం సోవియట్ యూనియన్ సుమారు 55 బంగారు పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 37 పతకాలతో రెండవ స్థానంలో తూర్పు జర్మనీ నిలిచింది. దక్షిణ కొరియా నాల్గవ స్థానంలో నిలవగా అమెరికా మూడవ స్థానంలో నిలిచింది.

లాస్‌ఏంజిలెస్ 1984

అమెరికన్ నగరం లాస్ ఏంజిల్స్ 1984 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. జూలై 28 నుండి ఆగస్టు 12 వరకు ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 23 వ ఒలింపిక్స్‌లో 140 దేశాల నుండి మొత్తం 6,829 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో 21 క్రీడల నుండి 221 ఈవెంట్లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. ఆ సంవత్సరం, అమెరికా 83 స్వర్ణాలతో సహా 174 పతకాలు సాధించింది. ప్రచ్ఛన్న యుద్ధం తరువాత సోవియట్ యూనియన్ ఒలింపిక్స్‌ను బహిష్కరించింది.

మాస్కో 1980

మాజీ సోవియట్ యూనియన్ రాజధాని మాస్కో 1980 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. జూలై 19 నుండి ఆగస్టు 13 వరకు ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 22 వ ఒలింపిక్స్‌లో 80 దేశాలకు చెందిన 5,179 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. మాస్కో గేమ్స్‌లో 21 క్రీడల నుండి 203 ఈవెంట్స్‌లో క్రీడాకారులు పోటీపడ్డారు. ఆ సంవత్సరం సోవియట్ యూనియన్ 80 స్వర్ణాలతో సహా 195 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణ జర్మనీ కూడా 126 పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం ఫలితంగా, అమెరికాతో సహా 65 దేశాలు మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు.

మాాంట్రియాల్ 1976

1976 ఒలింపిక్స్ కెనడా దేశం మాంట్రియల్‌ నగరంలో జరిగాయి. జూలై 17 నుండి ఆగస్టు 1 వరకు ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 21 వ ఒలింపిక్స్‌లో 92 దేశాలకు చెందిన 6,084 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. కెనడా 21 క్రీడల నుండి 198 ఈవెంట్స్‌లో క్రీడాకారులు పాల్గొన్నారు. ఆ సంవత్సరం సోవియట్ యూనియన్ 49 స్వర్ణాలతో సహా 125 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 90 పతకాలతో దక్షిణ జర్మనీ రెండవ స్థానంలో మరియు 94 పతకాలతో అమెరికా మూడవ స్థానంలో నిలిచింది. భారత పురుషుల హాకీ జట్టు పతకం లేకుండా 1976 ఒలింపిక్స్ పూర్తి చేసింది. 1928 తర్వాత మొదటిసారిగా, భారత హాకీ జట్టు పతకం లేకుండా తిరిగి వచ్చింది.

మ్యూనిక్ 1972

1972 ఒలింపిక్స్ జర్మనీ నగరమైన మ్యూనిచ్‌లో జరిగాయి. ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 11 వరకు జరిగాయి. 20 వ ఒలింపిక్స్‌లో మొత్తం 7,134 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. మ్యూనిచ్ 21 క్రీడల నుండి 195 ఈవెంట్లలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఆ రోజు ఒలింపిక్ గ్రామంలో పాలస్తీనా తీవ్రవాదులు జరిపిన దాడిలో 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లు మరియు ఒక జర్మన్ పోలీసు అధికారి మరణించారు. ఆ సంవత్సరం సోవియట్ యూనియన్ సుమారు 99 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. యునైటెడ్ స్టేట్స్ 94 పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో హాకీలో భారతదేశం కాంస్యం గెలుచుకుంది

మెక్సికో సిటీ 1968

1968లో 19వ ఎడిషన్ ఒలింపిక్ గేమ్స్ మెక్సికో నగరంలో జరిగాయి. ఒక లాటిన్ అమెరికా దేశం అందులో స్పానిష్ మాట్లాడే దేశంలో తొలిసారిగా ఒలింపిక్ గేమ్స్ నిర్వహించారు. 1968 అక్టోబర్ 12 నుండి 27 వరకు ఒలింపిక్స్ జరిగాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో తొలిసారిగా ఆల్ వెదర్ సింథెటిక్ ట్రాక్‌ను తొలిసారిగా ఈ ఒలింపిక్స్‌లోనే వినియోగించడం ప్రారంభించారు.మొత్తంగా 5,516 మంది క్రీడాకారులు 112 దేశాల నుంచి పాల్గొన్నారు. 18 క్రీడల నుంచి 172 ఈవెంట్స్‌లో క్రీడాకారులు పోటీపడ్డారు. ఈ గేమ్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశంగా అమెరికా నిలిచింది.

టోక్యో 1964

1964 లోన ఒలింపిక్స్ 18 వ ఎడిషన్ అక్టోబర్ 10 నుండి 24 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. ఆసియాలో ఒలింపిక్ క్రీడలు జరగడం ఇదే మొదటిసారి. ఈ ఆటలలో, దక్షిణాఫ్రికా తన దేశంలో జాతి వివక్ష వర్ణవివక్ష వ్యవస్థను ఉంచినందుకు నిషేధించబడింది. ఈ ఆటలలో 93 దేశాల నుండి 5151 మంది క్రీడాకారులు పాల్గొన్నారు, ఇందులో 4473 మంది పురుషులు మరియు 678 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ గేమ్స్‌లో టోక్యోలోని నేషనల్ స్టేడియంలో 19 క్రీడల్లో 163 ఈవెంట్‌లు నిర్వహించబడ్డాయి. ఈ క్రీడలలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది మరియు 36 స్వర్ణాలు, 26 రజతాలు మరియు 28 కాంస్యాలతో 90 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య దేశం జపాన్ 29 పతకాలతో మూడవ స్థానాన్ని దక్కించుకోగా, సోవియట్ యూనియన్ 96 పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. 8 క్రీడలలో 42 ఈవెంట్‌లలో పాల్గొన్న 52 మంది పురుషులు మరియు ఒక మహిళతో సహా 53 మంది ఆటగాళ్ల బృందాన్ని భారతదేశం పంపింది. ఈ గేమ్స్‌లో హాకీలో పాకిస్తాన్‌పై విజయం సాధించి భారత్‌ బంగారు పతకాన్ని పొందింది,

రోమ్ 1960

17వ ఎడిషన్ ఒలింపిక్ గేమ్స్ ఇటలీ రాజధానిలో ఆగష్టు 25 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు జరిగాయి. 103 పతకాలు నెగ్గి సోవియెట్ యూనియన్ అగ్రస్థానంలో నిలించింది. రెండవ స్థానంలో అమెరికా నిలవగా ఆతిథ్య దేశం ఇటలీ మూడవ స్థానంలో నిలిచింది.

మెల్‌బోర్న్ 1956

1956 ఒలింపిక్స్ 16 వ ఎడిషన్ మెల్‌బోర్న్‌లో 22 నవంబర్ నుండి 8 డిసెంబర్ వరకు జరిగాయి. స్టాక్‌హోమ్‌లో నిర్వహించిన ఈక్వెస్ట్రియన్ మినహా అన్ని ఈవెంట్‌లు ఆస్ట్రేలియాలో నిర్వహించబడ్డాయి. ఒలింపిక్ క్రీడలు దక్షిణ అర్ధగోళంలో మరియు ఓషియానియాలో జరగడం ఇదే మొదటిసారి. ఈ ఆటలలో సోవియట్ యూనియన్ అమెరికాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది, ఆతిథ్య ఆస్ట్రేలియా మూడవ స్థానంలో నిలిచింది.

హెల్సిన్కీ 1952

1952 లో జరిగిన 15 వ ఒలింపిక్స్ ఎడిషన్ ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో 19 జూలై నుండి ఆగస్టు 3 వరకు జరిగాయి. ఒలింపిక్ క్రీడల్లో భాగంగా జరిగిన ఈ ఎడిషన్ అత్యధిక ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది, ఒలింపిక్ చరిత్రలో సుదీర్ఘమైనది. 69 దేశాల నుండి 4925 మంది క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొన్నారు, ఇందులో అమెరికా 76 పతకాలతో అగ్రస్థానంలో ఉంది, సోవియట్ యూనియన్ రెండవ స్థానంలో నిలిచింది.

లండన్ 1948

1948 ఒలింపిక్స్ 14 వ ఎడిషన్ లండన్‌లో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒలింపిక్ క్రీడలు జరగడం ఇదే మొదటిసారి. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రెండు మునుపటి ఎడిషన్‌లు జరగలేదు. జూలై 19 నుండి ఆగస్టు 14 వరకు జరిగిన ఈ ఒలింపిక్స్‌లో 23 క్రీడల్లో 136 పతకాల కోసం పోటీపడ్డాయి. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ ఆటలను ఆస్టర్టీ గేమ్స్ అని కూడా అంటారు.

బెర్లిన్ 1936

1936 లో 11వ ఎడిషన్ ఒలింపిక్స్ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఆగస్టు 1 నుండి 16 వరకు జరిగాయి. ఈ గేమ్స్‌లో, 49 దేశాలు ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నాయి, వీటిలో 5 దేశాలు తొలిసారిగా ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేశాయి. ఆతిథ్య దేశం జర్మనీ 89 పతకాలతో పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 56 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.

లాస్‌ఏంజిలెస్ 1932

1932 లో, ఒలింపిక్ క్రీడల 10 వ ఎడిషన్ జూలై 30 నుండి ఆగస్టు 14 వరకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగాయి. ఈ గేమ్స్‌లోఒలింపిక్ క్రీడల కోసం తొలిసారిగా ఒలింపిక్ విలేజ్‌ను నిర్మించారు. ఇక ఈ ఒలింపిక్స్ గేమ్స్‌తో ప్రారంభమైన ఒలింపిక్ విలేజ్ ఆ తర్వాత నుంచి జరుగుతూ వస్తున్న ఒలింపిక్స్‌లో చాలా పాపులర్ అయ్యింది. ఈ సమయంలో ఒలింపిక్ మస్కట్ పరిచయం మరియు విజయం తర్వాత పోడియం పై పతకాలు ఇవ్వడం వంటి అంశాలతో సహా అనేక విషయాలు మొదటిసారి ఒలింపిక్స్‌కు వచ్చాయి.

ఆమ్‌స్టర్‌డామ్ 1928

1928 సంవత్సరంలో, ఒలింపిక్ క్రీడల 9 వ ఎడిషన్ నెదర్లాండ్స్ రాజధానిలో 28 జూలై నుండి ఆగస్టు 12 వరకు జరిగాయి. ఈ గేమ్స్‌లో అమెరికా జట్టు మరోసారి అత్యధిక బంగారు పతకాలు మరియు అత్యధిక పతకాలు గెలుచుకుంది . ఇక భారత్ గురించి చెప్పుకోవాలంటే బ్రిటీషు పాలన కింద ఉన్న భారత్ తొలిసారిగా ఈ గేమ్స్‌లో పాల్గొని ఫీల్డ్ హాకీ గేమ్‌లో బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత వరుసగా జరిగిన ఒలింపిక్స్‌లో ఆరుసార్లు భారత్ హాకీలో స్వర్ణం సాధించింది.

పారిస్ 1924

1924 లో జరిగిన 8 వ ఒలింపిక్స్ ఎడిషన్ జూలై 5 నుండి జూలై 27 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగాయి. ఫ్రాన్స్ ఈ ఆటలకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. ఈ క్రీడల్లో అమెరికన్ జట్టు మరోసారి అత్యధిక బంగారు పతకాలు గెలుచుకుంది మరియు ఆతిథ్య దేశం నుండి 401 మంది క్రీడాకారులు పాల్గొన్నప్పటికీ, అమెరికా నుండి 229 మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొనడానికి వచ్చారు.

యాంట్‌వెర్ప్ 1920

సాంకేతికంగా ఒలింపిక్స్ 7 వ ఎడిషన్ 1920 లో జరిగాయి. ఇది 1912 లో లండన్‌లో జరగాల్సి ఉండగా మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనందున వాయిదా పడ్డాయి. 1920 లో నిర్వహించబడ్డాయి. ఈ ఒలింపిక్ క్రీడలు బెల్జియంలో ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 12 వరకు జరిగాయి, ఇందులో అమెరికా అత్యధిక స్వర్ణం మరియు అత్యధిక పతకాలు సాధించింది.

స్టాక్‌హోం 1912

5 వ ఒలింపిక్ క్రీడలు 1912 మే 5 నుండి జూలై 22 వరకు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగాయి. ఈ క్రీడలలో, 28 దేశాల నుండి 2408 మంది క్రీడాకారులు 48 మంది మహిళలతో సహా 102 ఈవెంట్లలో పాల్గొన్నారు. ఆసియా ఖండం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి దేశంగా జపాన్ అవతరించింది. పూర్తి స్థాయిలో బంగారు పతకాలు అందించిన చివరి ఒలింపిక్స్‌గా 1912 స్వీడెన్ ఒలింపిక్స్ చరిత్రలో నిలిచాయి.

లండన్ 1908

నాల్గవ ఎడిషన్ ఒలింపిక్స్ లండన్‌లో 1908 ఏప్రిల్ 27 నుండి అక్టోబర్ 21 వరకు జరిగింది. 187 రోజుల పాటు జరిగిన ఈ ఒలింపిక్ క్రీడలు, ఇప్పటి వరకు చరిత్రలో సుదీర్ఘకాలం సాగిన ఒలింపిక్ క్రీడలుగా గుర్తింపు పొందాయి. ఈ ఆటలు మొదట్లో ఇటలీలోని రోమ్‌లో జరగాల్సి ఉంది, కానీ ఆర్థిక సమస్యల కారణంగా దీనిని లండన్‌కు మార్చారు.

సెయింట్ లూయిస్ 1904

1904 లో మూడవ ఎడిషన్ ఒలింపిక్స్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ నగరంలో జరిగాయి. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 3 వరకు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. ఒలింపిక్ క్రీడలు యూరప్ వెలుపల జరగడం ఇదే మొదటిసారి, మరియు విస్తరించిన క్రీడా కార్యక్రమంలో భాగంగా, జూలై 1 నుండి నవంబర్ 23 వరకు వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

పాారిస్ 1900

రెండవ ఎడిషన్ ఒలింపిక్స్ 1900 లో నిర్వహించబడ్డాయి. ఈ గేమ్స్‌ను ఫ్రెంచ్ రాజధాని పారిస్ 14 మే నుండి 28 అక్టోబర్ వరకు నిర్వహించింది.99 ఈవెంట్లలో 997 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళలు పాల్గొన్న తొలి ఒలింపిక్స్ ఇది. నావికుడు హెలెన్ డి పోర్టెల్స్ ఈ క్రీడలలో మొదటి మహిళా ఒలింపిక్ ఛాంపియన్ అయ్యారు.

ఏథెన్స్ 1896

గ్రీస్ రాజధాని ఏథెన్స్ నగరంలో 1896 ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు తొలి ఒలింపిక్స్ జరిగాయి. 14 దేశాల నుంచి 241 మంది క్రీడాకారులు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఇందులో ఎక్కువగా యూరోపియన్ దేశాలకు చెందిన వారు ఉండటం విశేషం. ఐరోపా రహిత దేశాల నుంచి పాల్గొన్న ఏకైక దేశంగా అమెరికా నిలిచింది.

ఒలింపిక్స్ న్యూస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+