For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sushil Kumarకు బిగుస్తున్న ఉచ్చు! ఘటన స్థలంలో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌!

Wrestler Sushil Kumar taken to Chhatrasal Stadium to recreate crime scene

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో అతనికి పెద్ద శిక్షపడే అవకాశం కనిపిస్తోంది. సాగర్‌పై దాడిలో సుశీల్ స్యయంగా పాల్గొన్నాడని ఆధారాలు సేకరించిన ఢిల్లీ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. సుశీల్‌ కుమార్‌తో కలిసి మంగళవారం పోలీసులు ఘటన జరిగిన ఛత్రశాల్‌ స్టేడియం వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి 'సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌' ద్వారా మే 4 రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

 ఆ రాత్రి ఏం జరిగిందని..

ఆ రాత్రి ఏం జరిగిందని..

'ఘటన జరిగిన రోజు అతను ఎక్కడ ఉన్నాడు. ఏం చేశాడని ప్రశ్నించాం. అనంతరం సుశీల్‌ దాక్కునేందుకు సహకరించిన సన్నిహితులు, మిత్రుల వివరాలు కూడా అడిగాం. మేం అన్ని కోణాల్లో విచారించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం'అని ఢిల్లీకి చెందిన పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఛత్రశాల్‌ స్టేడియంతో పాటు వివాదానికి కారణమైన మోడల్‌ హౌస్‌లోని ఫ్లాట్‌కు, షాలిమార్‌ బాగ్‌లో సుశీల్‌ నివాసం ఉంటున్న చోటుకు కూడా అతడిని పోలీసులు తీసుకెళ్లి పలు వివరాలు సేకరించారు. 'ఆ రోజు రాత్రి సుశీల్‌తో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటున్నాం. అతను సాగర్‌ను కొడుతున్నట్లుగా వచ్చిన వీడియోపై మరింత స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం' అని అధికారులు చెప్పారు.

 పొంతన లేని సమాధానాలు..

పొంతన లేని సమాధానాలు..

మంగళవారం కూడా నాలుగు గంటలపాటు సుశీల్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. 'విచారణ సందర్భంగా ఒకసారి సాగర్, సోనూలను తాను అక్కడకు లాక్కు రాలేదని, తగవు తీర్చేందుకు మాత్రమే వెళ్లానని అతను మాతో చెప్పాడు. మరోసారి దీని గురించే చెబుతూ తాను సాగర్‌ను కాస్త బెదిరించి భయపెట్టాలని మాత్రమే భావించానని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతని జవాబుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

సహజంగానే ఆందోళన గా ఉన్న సుశీల్‌ పదే పదే మాట మార్చాడు. గొడవ జరిగాక కూడా తాను ఛత్రశాల్‌ స్టేడియం లోనే ఉన్నానని, మరుసటి రోజు సాగర్‌ చనిపోయాడని తెలిశాకే పారిపోయానని మాతో చెప్పాడు' అని క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అంతటి పహిల్వాన్‌ కూడా జైలు గోడల మధ్య కన్నీళ్లు కార్చినట్లు ఆయన చెప్పారు. 'లాకప్‌లో పెట్టగానే సుశీల్‌ ఏడ్చేశాడు. రాత్రంతా మెలకువతోనే ఉండి పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న అతను ఏమీ తినేందుకు ఇష్టపడలేదు' అని కూడా ఆయన వివరించారు.

 ఉద్యోగం ఊడింది..

ఉద్యోగం ఊడింది..

ఊహించినట్లుగానే నార్తర్న్‌ రైల్వే సుశీల్‌ను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా అతను పని చేస్తున్నాడు. 'సుశీల్‌పై క్రిమినల్‌ కేసు నమోదు కావడంతోపాటు 48 గంటలకు మించి అతను పోలీస్‌ కస్టడీలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుశీల్‌ను సస్పెండ్‌ చేస్తున్నాం' అని నార్తర్న్‌ రైల్వేస్‌ అధికారికంగా ప్రకటించింది.

 ‘పద్మశ్రీ' వెనక్కి తీసుకుంటారా...

‘పద్మశ్రీ' వెనక్కి తీసుకుంటారా...

హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌కు 2011 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పౌర పురస్కారం 'పద్మశ్రీ'ని వెనక్కి తీసుకునే విషయంలో చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఏ అవార్డీపై రాలేదు కాబట్టి దీని విషయంలో ప్రభు త్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావి స్తోంది. అవార్డు నిబంధనల్లో ఇలా వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి స్పష్టమైన సూచనలు లేకపోయినా... అవార్డు గ్రహీతలు నైతికపరంగా ఉన్నతంగా ఉండాలనే కోణంలో భారత రాష్ట్రపతి కి మాత్రం అవార్డును రద్దు చేసే అధికారం ఉంది.

Story first published: Wednesday, May 26, 2021, 18:08 [IST]
Other articles published on May 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+