కేవలం పతకాల కోసమే కాకుండా.. కోట్లాది మందికి ఉపాధిని కల్పించేలా క్రీడా రంగాన్ని తీర్చుదిద్దుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదివారం కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత క్రీడా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, రాబోయే పదేళ్ల కోసం ప్రతిష్టాత్మకమైన 'ఖేలో ఇండియా మిషన్' రోడ్మ్యాప్ను ఆమె ఆవిష్కరించారు.
తన తొమ్మిదవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ క్రీడల ఆర్థిక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 'ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా ప్రారంభమైన క్రీడల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తూ.. రాబోయే 10 ఏళ్ల కాలంలో ఈ రంగాన్ని సమూలంగా మార్చడానికి మేం'ఖేలో ఇండియా మిషన్'ను ప్రారంభిస్తున్నాం' అని ఆమె పేర్కొన్నారు.

ఖేలో ఇండియా మిషన్ కేవలం ఆటగాళ్లకే కాకుండా, క్రీడా అనుబంధ రంగాల్లో వేలాది ఉపాధి అవకాశాలను సృష్టించనుంది
కోచింగ్, మేనేజ్మెంట్: సర్టిఫైడ్ కోచ్లు, హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్లు, టాలెంట్ స్కౌట్లకు డిమాండ్ పెరగనుంది.
స్పోర్ట్స్ సైన్స్: ఫిజియోథెరపిస్టులు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు, న్యూట్రిషనిస్టులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
తయారీ రంగం: 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా నాణ్యమైన క్రీడా పరికరాలను దేశీయంగా తయారు చేయడం ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది.
ఈ 10 ఏళ్ల ప్రణాళిక భారతదేశపు భవిష్యత్తు లక్ష్యాలతో ముడిపడి ఉంది:
2016-17లో గ్రామ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రారంభమైన 'ఖేలో ఇండియా' కార్యక్రమం, ఇప్పుడు ఒక పూర్తి స్థాయి 'మిషన్'గా రూపాంతరం చెందింది. పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయిల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా క్రీడాకారులకు స్కాలర్షిప్, మౌలిక సదుపాయాలను ఇది కల్పిస్తుంది.
క్రీడలను దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక శాశ్వతమైన భాగం చేయడం ద్వారా, భారత్ తన అభివృద్ధి ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఈ దశాబ్ద కాలపు ప్రణాళిక విజయవంతమైతే, ప్రపంచ క్రీడా యవనికపై భారత్ ఒక తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయం.