
ట్విటర్ వార్.. యాష్ట్యాగ్స్ ట్రెండ్స్..
బబితా విద్వేశాన్ని రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆమె ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేయాలని ఓ వర్గం #SuspendBabitaPhogat అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయగా.. ఆమె చేసిన ట్వీట్లో తప్పేముందని, బబితా పేర్కొన్న వ్యాఖ్యలు అక్షరాల నిజమని మరో వర్గం #ISupportBabitaPhogat అనే యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడుస్తుంది.
ప్రధాన సమస్య కరోనా కాదు..
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకునే బబితా.. బుధవారం దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ప్రసత్త పరిస్థితుల్లో కరోనా వైరస్ దేశం ఎదుర్కొంటున్న రెండో సమస్యని, ‘జహిల్ జమాతీస్' ప్రధాన ప్రాబ్లమ్ అంటూ ట్వీట్ చేసింది.
ఆగ్రహంతో ట్రోలింగ్..
ఈ ట్వీట్ నచ్చని కొందరూ ఆమెపై తీవ్ర ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. అసలు బబితా భారతీయురాలేనా? అని ఒకరు ప్రశ్నిస్తే.. ఆమె ప్రజల ప్రేమ, అభిమానం అందుకోవడానికి అర్హురాలు కాదని మరొకరు కామెంట్ చేస్తున్నారు. బబితా ట్వీటర్ అకౌంట్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ద్వేశానికి ఈ దేశంలో చోటులేదు బబితా.. అని ఇంకొందరు మండిపడుతున్నారు. ఇలాంటి వారు రోల్మోడల్స్ ఎలా అవుతారని కూడా ప్రశ్నిస్తున్నారు.
ప్రశంసలతో మద్దుతు..
ఇక మరికొందరూ ఆమె ముక్కుసూటితనాన్ని ప్రశంసిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు చెప్పిందని కొనియాడుతున్నారు. ఆమెకు తమ మద్దతు ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక బబితాపై జరుగుతున్న ట్రోలింగ్ను సహచర రెజ్లర్లు బజరంగ్ పూనియా, యోగేశ్వర్ దత్ తిప్పికొట్టారు. వారి స్పూర్తిదాయకమైన ప్రదర్శనలతో దేశానికి సేవ చేశారు కాబట్టే వారి జీవితాలపై సినిమాలు తీశారని ట్రోలర్స్పై మండిపడ్డారు.
ఇక హర్యానా ఎన్నికల ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న బబితా ఫోగాట్.. దాద్రి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.
1023 కరోనావైరస్ పాజిటివ్ కేసులకు
ఇక దేశంలోని 17 రాష్ట్రాలలో నమోదైన 1023 కరోనావైరస్ పాజిటివ్ కేసులకు తబ్లిగీ జమాత్ సంస్థ జరిపిన ప్రార్థనలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విదేశీయుల ద్వారా వైరస్ మిగతా వారికి సోకిందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












