ఇక్కడ వివిధ దేశాల వంటలు నోరూరించనున్నాయి. క్రీడాకారులకు ఆటవిడుపుగా వినోద కేంద్రాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పబ్లు, హోమ్ థియేటర్స్, కంప్యూటర్ గేమ్ జోన్లు అక్కడ కొలువు తీరాయి. ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ విలేజ్లో 7,500 మంది వాలంటరీ బృందం సేవలందించనుంది. ఈ గ్రామం నిర్మాణం కోసం లండన్ ఒలంపిక్ సన్నాహాక కమిటీ సుమారు రూ 826 కోట్లు ఖర్చు చేశారు.
ఇక ఈ లండన్ ఒలంపిక్స్లో పాల్గోనే భారత అథ్లెట్ల ప్రదర్శనను అభిమానులు ఈఎస్పీఎన్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భారత్కు పతకాలు వచ్చే అవకాశం ఉన్న షూటింగ్, బాక్సింగ్, ఆర్చరీ, టెన్నిస్, రెజ్లింగ్తో పాటు హాకీ మ్యాచ్లను భారత అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈఎస్ఎస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ పోటీలు భారత్లో ఈఎస్పీఎన్, స్టార్ స్పోర్ట్స్, ఈఎస్పీఎన్ హెచ్డీలద్వారా ప్రసారం అవుతాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 వరకు ఈఎస్పీఎన్లో పోటీలు ప్రసారం కానున్నాయి.
లండన్ ఒలింపిక్ క్రీడోత్సవం గ్రామంలో తొలి భారత బృందం మంగళవారం ప్రవేశించింది. భారత్ తరుపున లండన్ ఒలంపిక్స్లో అత్యధికంగా 81 మంది అథ్లెట్లు, 51 మంది అధికారులు పాల్గొంటున్నారు. వీరందరికి 'టైటన్' అనే సముద్రతీర భవనం ఎస్1లో వసతి ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి వాలంటీర్లను నిర్వాహకులు సమకూర్చారు. భారత బృందానికి ఏడుగురు వాలంటీర్లు ఉన్నారు. వారంతా భారత సంతతివారే కాని లండన్లో పని చేస్తున్నారు. ఈ గ్రామంలోకి అడుగుపెట్టిన తొలి భారత షూటర్ బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా. పది మంది సభ్యుల ఆర్చరీ బృందం, నలుగురు సభ్యుల వెయిట్లిఫ్టింగ్ బృందం కూడా గ్రామంలోకి ప్రవేశించారు. ఆర్చర్లు, లిఫ్టర్లు ముందుగా సోమవారం సాయంత్రం గ్రామంలోకి అడుగుపెట్టగా... ఆతరువాత కొద్దిసేపటికి బింద్రా వారితో చేరాడు.
తెలుగు వన్ఇండియా