
టోక్యో: కరోనా వైరస్ కారణంగా జూలైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని జపాన్ ప్రధాని షింజో అబేనే మంగళవారం అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది నిర్వహిస్తామని తమ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అంగీకరించిందని షింజో తెలిపారు. టెలిఫోన్ కాల్ ద్వారా ఐఓసీ ప్రెసిడెంట్ థోమస్ బాచ్కు ఈ విషయాన్ని తెలియజేశామని తమ ప్రతిపాదనకు ఆయన 100 శాతం ఒప్పుకున్నారని జపాన్ ప్రధాని స్పష్టం చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్ను రద్దు చేయమన్నారు.
2021 సమ్మర్లో పూర్తి ఒలింపిక్స్, పారాలింపిక్స్ను నిర్వహిస్తామని తెలిపారు. కరోనా వైరస్పై విజయానికి సాక్షిగా ఈ మెగా ఈవెంట్స్ జరుగుతాయన్నారు. ఇక షింజో అబే విజ్ఞప్తి మేరకు ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ప్రకటించింది. దీంతో 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఈ మెగా ఈవెంట్ వాయిదా పడినట్లైంది. దీంతో 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఈ మెగా ఈవెంట్ వాయిదా పడినట్లైంది.