టోక్యో: కరోనా వైరస్ కారణంగా జూలైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని జపాన్ ప్రధాని షింజో అబేనే మంగళవారం అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది నిర్వహిస్తామని తమ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అంగీకరించిందని షింజో తెలిపారు. టెలిఫోన్ కాల్ ద్వారా ఐఓసీ ప్రెసిడెంట్ థోమస్ బాచ్కు ఈ విషయాన్ని తెలియజేశామని తమ ప్రతిపాదనకు ఆయన 100 శాతం ఒప్పుకున్నారని జపాన్ ప్రధాని స్పష్టం చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్ను రద్దు చేయమన్నారు.
2021 సమ్మర్లో పూర్తి ఒలింపిక్స్, పారాలింపిక్స్ను నిర్వహిస్తామని తెలిపారు. కరోనా వైరస్పై విజయానికి సాక్షిగా ఈ మెగా ఈవెంట్స్ జరుగుతాయన్నారు. ఇక షింజో అబే విజ్ఞప్తి మేరకు ఒలింపిక్స్ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ప్రకటించింది. దీంతో 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఈ మెగా ఈవెంట్ వాయిదా పడినట్లైంది. దీంతో 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఈ మెగా ఈవెంట్ వాయిదా పడినట్లైంది.
After his telephone talks with IOC President Bach, PM Abe spoke to the press and explained that the two have agreed that the Tokyo Olympic Games would not be cancelled, and the games will be held by the summer of 2021. pic.twitter.com/ihe8To2g3R
— PM's Office of Japan (@JPN_PMO) March 24, 2020