జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన మహబూబాద్ కుర్రోడు

హైదరాబాద్: జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో మహబూబాద్ కుర్రాడు సత్తా చాటాడు. స్టూడెంట్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు జరిగిన నేషనల్ గేమ్స్లో మహబూబాద్ జిల్లా, కేసముద్రం మండలం, కోమటిపల్లి గ్రామం, కోక్య తండాకు చెందిన ఇస్లావత్ ఆలోజి బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మయూర్ విహార్ గ్రౌండ్లో జరిగిన అథ్లెటిక్స్ ఈవెంట్, అండర్ 25 కేటగిరిలో మూడో స్థానంలో నిలిచిన అలోజి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

మెడల్ సాధించిన ఆలోజిని స్టూడెంట్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ సుదర్శన్ గౌడ్ అభినందనించారు. మహబూబాద్ జిల్లా వాసులు, స్థానికులు కూడా ఆలోజిన ప్రశంసించారు.

Story first published: Monday, February 28, 2022, 16:01 [IST]
Other articles published on Feb 28, 2022
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications