న్యూఢిల్లీ: కరోనా వల్ల ఎదురైన ఆర్థిక సంక్షోభం నుంచి తమను ఆదుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ).. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలను ఆదుకోవడానికి రూ. 200 కోట్ల మేర సాయం చేయాలని క్రీడా మంత్రి కిరణ్ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా లేఖ రాశారు. 'గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వకపోతే గేమ్స్ను రీ స్టార్ట్ చేయడం చాలా కష్టమవుతోంది. ఐఓఏకు రూ. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్కు రూ.5 కోట్లు, నాన్ ఒలింపిక్ స్పోర్ట్ ఎన్ఎస్ఎఫ్కు రెండున్నర కోట్లు, స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్లకు రూ. కోటి చొప్పున ఇవ్వాలి. ఇవన్నీ కలిపితే దాదాపు రూ.220 కోట్లు అవుతుంది.
కరోనా కారణంగా స్పాన్సర్లు ఎవరూ రావడం లేదు. గేమ్స్ను ఎఫెక్టివ్గా రీస్టార్ట్ చేయడానికి డబ్బులు ఇబ్బంది చాలా ఉంది.'అని బాత్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు స్పోర్ట్స్ మినిస్ట్రీ అధికారులు నిరాకరించారు. తమకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. ఈ అంశాలను పక్కన పెడితే.. ఐఓఏ, ఇతర ఫెడరేషన్లు కలిపి కరోనా నిర్మూలన కోసం రూ.9.5 కోట్లు పీఎం కేర్స్కు విరాళంగా ఇవ్వడం కొసమెరపు.
రోహిత్ భాయ్.. తిట్టని తిట్టూ తిట్టారు: బంగ్లాదేశ్ క్రికెటర్