న్యూఢిల్లీ: యూత్ వరల్డ్ చాంపియన్షిప్స్లో భారత యువ బాక్సర్ల హవా నడుస్తోంది. ఇండియాకు చెందిన ఎనిమిది మంది బాక్సర్లు ఫైనల్కు చేరారు. ఇందులో ఏడుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. మరో ముగ్గురు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. దాంతో ఇండియాకు 11 మెడల్స్ ఖాయమయ్యాయి. గీతికా(48కేజీ), బేబీరోజిసనా చాను(51 కేజీ), వింకా(60 కేజీ), అరుంధతి చౌదరీ(69 కేజీ), పూనమ్ (57 కేజీ), తోక్చోమ్ సనామాచ చాను(49 కేజీ), అల్ఫియా పఠాన్(81 కేజీ ప్లస్), సచిన్(56 కేజీ) తమ తమ కేటగిరీల్లో బుధవారం ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నారు.
మహిళల 51 కేజీల కేటగిరి సెమీఫైనల్ బౌట్లో బేబీరోజిసనా చాను 5-0తో ఇటలీకి చెందిన ఎలెన్ అయారీపై తిరుగులేని విజయం సాధించింది. అరుంధతి, సనామచా, పూనమ్, అల్ఫియా కూడా తమ సెమీఫైనల్ బౌట్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. పురుషుల కేటగిరీలో సచిన్(56కేజి) ఒక్కడే ఫైనల్ చేరగా.. మిగతా ముగ్గురు బ్రాంజ్ మెడల్తో సరిపెట్టుకున్నారు. ఏడుగురు మహిళా బాక్సర్లు ఫైనల్ చేరడంతో విమెన్స్ టేబుల్లో ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. పురుషుల టేబుల్లో నాలుగో స్థానం దక్కించుకుంది.