బర్మింగ్ హామ్: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ దూసుకెళ్తుంది. టోర్నీ 9వ రోజు భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల 300 మీటర్ల స్టీపుల్ చేజ్ లో అవినాష్ సాబ్లే రజతం సాధించగా.. 10 వేల మీటర్ల రేస్ వాక్ లో ప్రియాంక గోస్వామి కూడా సిల్వర్ మెడల్ సాధించింది. పురుషు లాన్ బౌల్స్ టీమ్ రజత పతకంతో సరికొత్త చరిత్రను లిఖించగా.. భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ చేరి పతకం ఖాయం చేసింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్ చేరగా తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ ఫైనల్ కు దూసుకెళ్లింది.