For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా మారథాన్‌లో పెను విషాదం.. భీకర గాలులకు 21 మంది రన్నర్ల బలి!

China officials Probes Deaths Of 21 Ultramarathon Runners After Freak Weather Hits Race
#TOPNEWS: Congo Volcano Eruption | Oneindia Telugu

బీజింగ్‌: చైనాలో శనివారం జరిగిన మారథాన్‌ పెను విషాదన్ని మిగిల్చింది. భీకర గాలులు.. భారీ వర్షాల ధాటికి 21 మంది రన్నర్లు దుర్మరణం పాలయ్యారు. అల్ట్రా మారథాన్‌లో భాగంగా జరిగిన ఈ పోటీల్లో అత్యంత క్లిష్టమైనదిగా భావించే 100 కిలో మీటర్ల రేసులో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అథ్లెట్లు ఎల్లో నది స్టోన్‌ అడవి ప్రాంతానికి వచ్చేసరికి అకస్మాత్తుగా భారీ వర్షం, భీకర గాలులు మొదలయ్యాయి. గాలి, వానకు తోడు వడగళ్లు పడడంతో వారంతా చెల్లాచెదురైపోయారు.

ఈ క్రమంలోనే కొందరు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరికొందరి ఆచూకీ గల్లంతైంది. వెంటనే అప్రమత్తమైన నిర్వహకులు.. 1200 మంది బృందంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయానికి చనిపోయిన 21 మంది మృతదేహాలూ లభ్యమయ్యాయి. 172 మంది ఈ రేసులో పాల్గొనగా.. 21 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు.

మిగిలిన 151 మంది సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. సముద్ర మట్టానికి 6500 అడుగుల పైన ఎత్తులో ఈ రేసును నిర్వహించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, వాతావరణ హెచ్చరికలు తెలుసుకోకుండా నిర్వాహకులు రేసును ఎలా నిర్వహించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Story first published: Monday, May 24, 2021, 12:37 [IST]
Other articles published on May 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+