హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే రెండు స్వర్ణాలతో సహా మొత్తం 8 పతకాలు సాధించారు. షూటింగ్ విభాగంలోనే ఐదు మెడల్స్ దక్కాయి. మహిళల షాట్పుట్లో కిరణ్ బలియాన్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజే బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. శనివారం మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది.
అథ్లెటిక్స్ పోటీలతో పాటు స్క్వాష్ ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో భారత్ను పతకాలు వరించనున్నాయి. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 33కు చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యలున్నాయి. పతకాల పట్టికలో 200 మెడల్స్తో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 99 పతకాలతో జపాన్, 102 మెడల్స్ కొరియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 33 మెడల్స్ భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ఆసియా క్రీడల్లో నేటి భారత షెడ్యూల్..
అథ్లెటిక్స్ (ఉదయం 6.25 నుంచి)
జ్యోతి యర్రాజి, నిత్య (మహిళల 100 మీ హర్డిల్స్ హీట్స్); మహ్మద్ అజ్మల్ (400 మీ. ఫైనల్స్, సా.5.40 నుంచి); గుల్వీర్, కార్తీక్ (10 వేల మీ. ఫైనల్, సా.5.50 నుంచి)
టెన్నిస్ (ఉదయం10.30 నుంచి)
రోహన్ బోపన్న-రుతుజ × సంగ్-లియాంగ్ (మిక్స్డ్ డబుల్స్ ఫైనల్)
బాక్సింగ్ (మధ్యాహ్నం 12.15 నుంచి)
లవ్లీనా × సియాంగ్ (మహిళల 75 కేజీల క్వార్టర్స్); ప్రీతి × జైనా (మహిళల 54 కేజీల క్వార్టర్స్)
వెయిట్లిఫ్టింగ్ (మధ్యాహ్నం 12.30 నుంచి)
మీరాబాయిచాను (49 కేజీ); బింద్యారాణి దేవి (55 కేజీ)
స్క్వాష్ (మధ్యాహ్నం 1 నుంచి)
భారత్ × పాకిస్థాన్ ( టీమ్ ఫైనల్)
పురుషుల హాకీ (సాయంత్రం 6.15 నుంచి)
భారత్ × పాకిస్థాన్