
దుమ్మురేపిన దీపిక..
మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో దీపిక 6-0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)ను చిత్తుచేసి పసిడి పతకం సొంతం చేసుకుంది. మిక్స్డ్ టీమ్లో దీపిక- అతాను దాస్ జోడీ బంగారు పతకం సాధించింది. దీపిక, అంకిత భకత్, కోమలిక బారిలతో కూడిన భారత రికర్వ్ మహిళల జట్టు గోల్డ్ మెడల్తో సత్తా చాటింది. మిక్స్డ్ ఫైనల్లో దీపిక- అతాను 5-3తో గాబ్రియెలా ష్లోసర్- వాన్ బెర్గ్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు.

ఘనంగా మ్యారెజ్ యానివర్సరీ..
ఒకదశలో 0-2తో వెనుకబడిన దీపిక- అతాను అద్భుతంగా పుంజుకుని భారత్కు బంగారు పతకం అందించారు. ప్రపంచకప్లో మిక్స్డ్ విభాగంలో భారత్ స్వర్ణం సాధించడం ఇదే ప్రథమం. 2016 అంటాల్యా ప్రపంచకప్లో దీపిక- అతాను రజతం సాధించారు. గతేడాది జూన్ 30న వివాహ బంధంతో ఒక్కటైన దీపిక- అతాను ప్రపంచకప్లో స్వర్ణ పతకంతో మొదటి వార్షికోత్సవాన్ని మరింత చిరస్మరణీయం చేసుకున్నారు.

భారత్ 4
ఇక మహిళల రికర్వ్ టీమ్ ఫైనల్లో భారత్ 5-1తో మెక్సికోను చిత్తుచేసి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ తొలి అంచెలోనూ భారత మహిళల జట్టు స్వర్ణంతో మెరిసింది. మొత్తంగా ప్రపంచకప్లో భారత మహిళల జట్టుకు ఇది ఆరో స్వర్ణం. ఆరు సార్లూ దీపిక బరిలో దిగడం విశేషం. ఈ టోర్నీలో భారత్ 4 స్వర్ణాలు సాధించింది. శనివారం పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్వర్మ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












