12 రైడ్లలో 7 పాయింట్లు సాధించిన సిద్ధార్థ్ దేశాయ్
స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 12 రైడ్లలో 7 పాయింట్లు సాధించగా.. ట్యాక్లింగ్లో అరుణ్ (6 పాయింట్లు), విశాల్ (5 పాయింట్లు) రాణించారు. పల్టన్స్ తరఫున మన్జీత్ (9 పాయింట్లు), నితిన్ తోమర్ (8 పాయింట్లు) ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ను తెలుగు టైటాన్స్ చాలా పేలవంగా మొదలెట్టింది.
సిద్ధార్థ్ దేశాయ్
మ్యాచ్ తొలి రెండు నిమిషాల్లోనే టైటాన్స్ 0-5తో వెనుకబడింది. విశాల్ సూపర్ ట్యాకిల్తో పుంజుకున్న టైటాన్స్.. ప్రత్యర్థిని అందుకోవడమే కాకుండా 16 నిమిషాలు ముగిసేసరికి 13-10తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కొద్దిసేపటికే
అరుణ్ సూపర్ ట్యాకిల్తో తెలుగు టైటాన్స్ను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు.
అతడే సమయమిచ్చాడు: ధోనీని ఎంపిక చేయకపోవడం వెనుక కొత్త ట్విస్ట్!
14-17తో వెనుక బడిన తెలుగు టైటాన్స్
కానీ ఆధిక్యాన్ని నిలుపుకోవడంలో విఫలమైంది. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి తెలుగు టైటాన్స్ 14-17తో నిలిచింది. రెండో అర్ధభాగంలో దూకుడుగా ఆడిన టైటాన్స్ 19-21తో ప్రత్యర్థికి సమీపంగా వెళ్లగలిగింది. వెంటనే మంజీత్ (9) సూపర్ రైడ్తో పుణెరి 25-19తో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది.
ఆకట్టుకున్న నితిన్ తోమర్
మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 25-33తో వెనకబడి ఓటమి ఖరారు చేసుకుంది. ఇక అక్కడి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన పల్టన్ చివరకు 34-27తో మ్యాచ్ను తమ ఖాతాలో వేసుకుంది. పుణెరి తరపున మంజీత్తో పాటు నితిన్ తోమర్ (8) ఆకట్టుకున్నాడు.
24 పాయింట్లతో రెండోస్థానంలో
ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం మూడింట్లో మాత్రమే గెలిచిన తెలుగు టైటాన్స్ 24 పాయింట్లతో పట్టికలో చివరి నుంచి రెండోస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 38-35 తేడాతో పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ (16) రైడింగ్లో సత్తాచాటాడు.
ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం
బెంగళూరు బుల్స్ vs గుజరాత్ ఫార్చ్యూన్జెయింట్స్ (రాత్రి 7:30 నుంచి)
యు ముంబా vs జైపుర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:30 నుంచి)