బెంగళూరు: ప్రొకబడ్డీ లీగ్ సీజన్-8లో బెంగళూరు బుల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కెప్టెన్ పవన్ షెరావత్ 22 పాయింట్లతో పంజావిసరడంతో హర్యానా స్టీలర్స్పై బెంగళూరు బుల్స్ అద్భుత విజయాన్నందుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 42-28 తేడాతో హర్యానా స్టీలర్స్ను చిత్తు చేసింది. హర్యానా తరఫున వికాస్ కండాల 7 పాయింట్లతో రాణించాడు. ఇక హర్యానా జట్టులో పవన్ షెరావత్ ఆల్రౌండ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. 15 టచ్, 4 బోనస్, 3 ట్యాకిల్ పాయింట్స్తో దుమ్మురేపాడు.
సింగిల్ హ్యాండ్తో జట్టును గెలిపించాడు. గేమ్ ఆరంభం నుంచి దూకుడు కనబర్చిన బెంగళూరు బుల్స్.. ఫస్టాఫ్ ముగిసే సరికి 19-13తో 6 పాయింట్లు లీడ్ సాధించింది. హర్యాను ఒకసారి ఆలౌట్ చేయడంతో పాటు 10 రైడ్, 7 ట్యాకిల్ పాయింట్స్ సాధించింది. సెకండాఫ్లోనూ అదే జోరును కనబర్చి మరోసారి హర్యానాను ఆలౌట్ చేసిన బెంగళూరు.. 10 రైడింగ్ పాయింట్స్తో పాటు 11 ట్యాకిల్ పాయింట్స్తో 23 పాయింట్లు సాధించి విజయాన్నందుకుంది.
అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్లో యూ ముంబా 37-28తో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. యూ ముంబా స్టార్ రైడర్స్ అజిత్ 11, అభిషేక్ సింగ్ 10 రైడింగ్ పాయింట్స్ సత్తా చాటారు. జై పూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 14 రైడింగ్ పాయింట్స్తో పోరాడినా ఫలితం లేకపోయింది. ఫస్టాఫ్ ముగిసేసరికి యు ముంబా 21-12తో లీడ్ సాధించింది. జైపూర్ను ఒక సారి ఆలౌట్ చేయడంతో పాటు 15 రైడింగ్, 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించింది. సెకండాఫ్లో జైపూర్ పుంజుకున్నప్పటికీ ఆధిక్యం కాపాడుకొని విజయాన్నందుకుంది. ఇక రేపటి మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్ vs పుణేరి పల్టాన్, పాట్నా పైరేట్స్ vs బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.