
గుజరాత్దే విజయం..
మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 34-27తో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. గుజరాత్ డిఫెండర్ గిరీష్ మారుతి 7 టాకిల్ పాయింట్లు సాధించగా.. రైడర్లు రాకేష్ నర్వాల్ 7, హెచ్ఎస్ రాకేష్ 6 పాయింట్లతో రాణించారు. జైపూర్ రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్-10 సాధించినా తన జట్టును గెలిపించలేక పోయాడు. రైడర్లు జోరు ప్రదర్శించడంతో 10 నిమిషాల ఆట పూర్తయ్యే సరికి గుజరాత్ 13-7తో పైచేయి సాధించింది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన జెయింట్స్ 18-12తో నిలిచింది.

ఆలౌట్ చేసి..
అయితే, 18వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్కు వెళ్లిన దేశ్వాల్.. గుజరాత్ను ఆలౌట్ చేయడంతో జైపూర్ 17-18తో మ్యాచ్లోకి వచ్చింది. 19-17తో ఫస్టాఫ్ను ముగించింది. 37వ నిమిషంలో ఇరుజట్లూ 27-27తో సమంగా నిలవడంతో ఆసక్తి రేగింది. కానీ, చివరి నిమిషాల్లో వ్యూహాత్మకంగా ఆడిన గుజరాత్.. జైపూర్ను దెబ్బకొట్టింది. డూ ఆర్ డై రైడ్కు వచ్చిన నవీన్ను జెయింట్స్ ఆటగాడు రవీంద్ర పహల్ పట్టేయడంతో గుజరాత్ 29-27తో ముందంజ వేసింది. ఆ తర్వాత జైపూర్ను ఆలౌట్ చేసి మ్యాచ్ను సొంతం చేసుకుంది.

పట్నా సూపర్ విక్టరీ..
పట్నా పైరేట్స్ 42-39తో హరియాణా స్టీలర్స్పై గెలిచింది. మోనూ గోయత్ 15 పాయింట్లు తీసుకొచ్చాడు. హర్యానాకు వికాస్ ఖండోలా 6, రోహిత్ గులలియా 10, జైదీప్ కుల్దీప్ చెరో ఐదు పాయింట్లు అందించారు. ఇందులో హర్యానా మొదటి అర్ధభాగంలో 4 పాయింట్ల ఆధిక్యాన్ని కొనసాగించింది. కానీ రెండవ సగంలో పట్నా అద్భుతంగా ఆడింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో హర్యానా స్టీలర్స్ 22 పాయింట్లు జోడించగా, పట్నా 18 పాయింట్లు సాధించింది. తొలి అర్ధభాగంలో హర్యానా రైడ్ల ద్వారా 13 పాయింట్లు, ట్యాకిల్స్తో 7 మరియు ఆల్ అవుట్ల నుండి 2 పాయింట్లు సాధించగా.. పట్నా రైడ్ల ద్వారా 13 పాయింట్లు, ట్యాకిల్స్ ద్వారా 2 పాయింట్లు మరియు 2 అదనపు పాయింట్లను మాత్రమే జోడించింది. రెండో అర్ధభాగంలో పట్నా 24 పాయింట్లు జోడించగా, హర్యానా జట్టు 17 పాయింట్లు మాత్రమే పొందగలిగింది. చివరి అర్ధభాగంలో పట్నా రైడ్ల ద్వారా 15 పాయింట్లు మరియు ట్యాకిల్స్తో 7 పాయింట్లు జోడించగా, హర్యానా రైడ్లతో 10 పాయింట్లు మరియు ట్యాకిల్స్తో 7 పాయింట్లు సాధించింది.

నేటి మ్యాచ్లు..
యు ముంబా vs దబాంగ్ ఢిల్లీ
తమిళ్ తలైవాస్ vs బెంగళూరు బుల్స్
బెంగాల్ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్


Click it and Unblock the Notifications












