
వేలం ఎప్పుడంటే..
పీకేఎల్ సీజన్- 8 వేలం ముంబై వేదికగా ఈ నెల(ఆగస్టు) 29, 30, 31 తేదీల్లో జరగనుంది. ఈ వేలంలో 500 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. పీకేఎల్ సీజన్ 6, 7 తోపాటు అమెచ్చూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎప్ఐ) సమక్షంలో జరగిన కబడ్డి చాంపియన్షిప్స్ 2020, 2021 టోర్నీల్లో పాల్గొన్న ఆటగాళ్లకు వేలంలో పాల్గొననున్నారు. సీజన్-8లో ప్రతీ ఫ్రాంచైజీ దగ్గర రూ.4.4 కోట్ల పర్స్ ఉంటుంది.
సీజన్-8 ప్లేయర్ వేలంలో డొమెస్టిక్, ఓవర్సీస్, న్యూ యంగ్ ప్లేయర్స్తో ఏబీసీడీ నాలుగు కేటగిరీలుగా విభజించనున్నారు. మళ్లీ అందులో ఆల్రౌండర్స్, డిఫెండర్స్, రైడర్స్గా సబ్ డివైడ్ చేయనున్నారు. కేటగిరి-ఏ ఆటగాళ్లకు రూ.30 లక్షలు, కేటగిరి -బి-రూ.20 లక్షలు, కేటగిరి సీ-రూ. 10 లక్షలు, కేటగిరి డీ-రూ.6 లక్షలు బేస్ ప్రైజ్గా నిర్ణయించారు.

రిటైన్ చేసుకునేది ఆరుగురినే..
ప్రతీ టీమ్ ఆరుగురు సీనియర్ ప్లేయర్లను.. మరో ఆరుగురరు యువ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతా ఆటగాళ్లు వేలంలోకి వస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ చానెల్స్లో ప్రసారం అవుతోంది. ఆన్లైన్ వేదిక డిస్నీ స్ట్రీమ్ హాట్స్టార్ వీఐపీలో కూడా ప్రత్యక్ష ప్రసాం జరుగుతోంది. అంతేకాకుండా అధికారిక ప్రొకబడ్డీ వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. డిసెంబర్ 2021లో సీజన్ 8 జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అనుసరించి టోర్నీ జరగనుంది.

8 టీమ్స్..
1. బెంగాల్ వారియర్స్, 2. బెంగళూరు బుల్స్, 3. దంబంగ్ ఢిల్లీ, 4. జైపు పింక్ పాంథర్స్, 5. గుజరాత్ ఫార్చూనైట్స్, 6. తమిళ్ వారియర్స్, 7. తెలుగు టైటాన్స్, 8. యూ ముంబా, 9. హర్యానా స్టీలర్స్, 10. యూపీ యోధా,11. పాట్నా పైరెట్స్, 12. పుణేరి పల్టాన్,


Click it and Unblock the Notifications












