
హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై జరిగిన చివరి అంచె మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓటమి పాలైంది. శుక్రవారం రాత్రి చివరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై జైపూర్ పింక్ పాంథర్స్ 22-19 పాయింట్లతో విజయం సాధించింది.
నాలుగో విజయం: ఉఠ్కంఠ పోరులో పట్నాను ఓడించిన యు ముంబా
ఈ మ్యాచ్లో జైపుర్ పింక్ పాంథర్స్ జట్టు రైడింగ్లో 9 పాయింట్లు, ట్యాకిల్స్లో 13 ఇలా మొత్తం 22 పాయింట్లు సాధించగా.... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ రైడింగ్లో 8, ట్యాకిల్స్లో 9, ఎక్స్ట్రాల ద్వారా మరో 2 మొత్తం 19 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.
జైపుర్ పింక్ పాంథర్స్ జట్టులో దీపక్ హుడా 5 రైడింగ్ పాయింట్లతో ఆకట్టుకోగా... విశాల్ 3 పాయింట్లతో టాప్ ఢిపెండర్గా నిలిచాడు. మరోవైపు గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్లో సచిన్ 3 రైడ్ పాయింట్లతో ఆకట్టుకోగా... పంకజ్ 6 ట్యాకిల్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు.
మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు:
గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్
బెస్ట్ రైడర్ - సచిన్ (3 Raid Points)
బెస్ట్ డిఫెండర్ - పంకజ్ (6 Tackle Points)
జైపుర్ పింక్ పాంథర్స్:
బెస్ట్ రైడర్ - దీపక్ హుడా (5 Raid Points)
బెస్ట్ డిఫెండర్ - విశాల్ (3 Tackle Points)
ప్రొ కబడ్డీలో శనివారం
తమిళ్ తలైవాస్ vs బెంగళూరు బుల్స్ రాత్రి 7.30 నుంచి
బంగాల్ వారియర్స్ vs దబంగ్ ఢిల్లీ రాత్రి 8.30 నుంచి