బెంగాల్ తరఫున ద్వితీయార్ధంలో
బెంగాల్ తరఫున ద్వితీయార్ధంలో స్టార్ రైడర్ జాంగ్కున్లీ 10 పాయింట్లతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. బెంగాల్ వారియర్స్ తరఫున జాంగ్ కున్ లీ 10, మణిందర్ సింగ్ 6, మహేశ్ గౌడ్ 5 రైడ్ పాయింట్లు సాధించారు ట్యాక్లింగ్లో సుర్జిత్ సింగ్ (2 పాయింట్లు) ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి.
ఐపీఎల్: సన్రైజర్స్ను వీడి ముంబైకి చేరిన ధావన్
మ్యాచ్ ఆరంభం నుంచి పోటాపోటీగా
దాంతో స్కోర్లు 2-2, 4-4 ఇలా సమం అవుతూ వచ్చాయి. మనిందర్ సింగ్ రైడింగ్లో రెండు పాయింట్లు తేవడంతో మ్యాచ్లో తొలిసారి ఎనిమిదో నిమిషంలో వారియర్స్ 8-5తో ఆధిక్యం సంపాదించింది. అయితే వెంటనే పుంజుకున్న ఢిల్లీ 8-8తో స్కోరు సమం చేసింది. అదే జోరులో వారియర్స్ను ఆలౌట్ చేసి 12-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ప్రథమార్ధం ముగిసేసరికి ఢిల్లీ 16-13 ఆధిక్యాన్ని
ఇరు జట్లు మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రథమార్ధం ముగిసేసరికి ఢిల్లీ 16-13 ఆధిక్యాన్ని అందుకుంది. కీలకమైన ద్వితీయార్ధంలో అదే జోరును కొనసాగిస్తూ ఢిల్లీ కీలక పాయింట్లతో విజయం వైపు నడిచింది. విరామం తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఢిల్లీ రెండో సారి ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 25-15తో తిరుగులేని స్థాయిలో నిలిచింది. మ్యాచ్ చివరి వరకు ఆదే ఆధిక్యాన్ని నిలబెట్టుకొని విజయం సాధించింది.
మంగళవారం జరిగే మ్యాచ్లలో
మరో మ్యాచ్లో పుణెరి పల్టాన్ 27-25తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. సోమవారం విశ్రాంతి దినం కావడంతో.. మంగళవారం జరిగే మ్యాచ్లలో యు ముంబాతో తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి.