2013 నుంచి సన్రైజర్స్తో ధావన్..:
2013 నుంచి సన్రైజర్స్తో కలిసి కొనసాగుతున్న ధావన్.. తనకు సహచర క్రికెటర్లు కోహ్లీ(17 కోట్లు), రోహిత్శర్మ(15 కోట్లు), ధోనీ(15 కోట్లు) పోలిస్తే 5.2 కోట్లు మాత్రమే దక్కతుండటమే అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం భారత జట్టులో శిఖర్ ధావన్ రెగ్యులర్ ఓపెనర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన స్థాయికి తగిన ఫీజు రావడం లేదని గబ్బర్ అసంతృప్తితో ఉన్నాడట.
అచ్చం బుమ్రాలాగే పాక్ చిన్నారి బౌలింగ్: ట్విట్టర్లో స్పందించిన బుమ్రా
చర్చలు సఫలమైతే ముంబై ఇండియన్స్కు
చర్చలు సఫలమైతే ధావన్ ముంబై ఇండియన్స్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ధావన్, రోహిత్ ఓపెనర్లుగా ఐపీఎల్లో చెలరేగే అవకాశాలు ఉన్నాయి. సన్రైజర్స్ను వీడేందుకు తాను అనుకూలంగా ఉన్నానని ఫ్రాంచైజీ యాజమాన్యంతో ధావన్ చెప్పినట్టు తెలుస్తోంది. భారత జట్టులో టాప్-4 స్థానంలో ఉన్న తనను ఎందుకు రీటైన్ చేసుకోలేదని హైదరాబాద్ కోచ్ టామ్ మూడీతో శిఖర్ అంతకు ముందు వాదించాడట.
గబ్బర్ను రైట్ టు మ్యాచ్ కింద
టీమిండియాలోని విరాట్ కోహ్లీ (రూ. 17 కోట్లు), రోహిత్ శర్మ (రూ.15 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ.15 కోట్లు) భారీ మొత్తాలు ఆర్జిస్తున్నారు. ధావన్కు మాత్రం రూ.5.2 కోట్లు మాత్రమే వస్తున్నాయి. అదే సన్రైజర్స్ అతడిని రీటెయిన్ చేసుకొని ఉంటే రూ.12 కోట్లు లేదా రూ.8.5 కోట్లు దక్కేవి. అలా కాకుండా ఆ జట్టు డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ను రీటెయిన్ చేసుకుంది. గబ్బర్ను రైట్ టు మ్యాచ్ కింద తీసుకుంది. దీంతో తనకు ప్రాధాన్యం లేదని గబ్బర్ భావిస్తున్నట్టూ తెలుస్తోంది.
రోహిత్తో ధావన్ ముంబై ఓపెనర్లుగా
ఇదే విషయమై జట్టు యాజమాన్యం స్పందిస్తూ మేము కూడా కొంతమంది ఆటగాళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం కొసమెరుపు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ ట్రేడింగ్ విండో వారం పాటు నడుస్తోంది. ఇప్పటికే ముంబై పేపర్ ముష్ఫీకర్ రహీమ్ను వదులుకుని అతని స్థానంలో క్వింటన్ డీకాక్ను తీసుకుంది. ఇదే క్రమంలో ధవన్ను తీసుకుంటే..కెప్టెన్ రోహిత్శర్మతో కలిసి ధవన్ ముంబై తరఫున ఓపెనింగ్కు దిగే అవకాశముంటుంది.