ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11లో పుణేరి పల్టాన్ మళ్లీ విజయాల బాట పట్టింది. గత మ్యాచ్లో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పుణేరి పల్టాన్36-22 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది.
పుణేరి పల్టాన్ తరఫున పంకజ్(6), కెప్టెన్ అస్లాం(5), మోహిత్(6), గౌరవ్(4), అమన్(4) సమష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు బుల్స్లో ఆల్రౌండర్ పంకజ్ 6 పాయింట్లతో సత్తా చాటగా.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.

మ్యాచ్ ఆరంభం నుంచే పుణేరి పల్టాన్ ఆధిపత్యం చెలాయించింది. రైడింగ్, ట్యాక్లింగ్లో అదరగొట్టింది. దాంతో ఫస్టాప్లోనే బెంగళూరు బుల్స్ను ఒకసారి ఆలౌట్ చేసి 18-11 తేడాతో పుణేరి పల్టాన్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లోనూ అదే జోరు కనబర్చిన పుణేరి పల్టాన్ ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకొని విజయాన్నందుకుంది.

ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్లో పాట్నా పైరేట్స్ 42-40 తేడాతో తమిళ్ తలైవాస్ను ఓడించింది. పాట్నా పైరేట్స్ రైడర్ దేవాంక్ 25 పాయింట్లతో సత్తా చాటాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ కండాలా 15 పాయింట్స్తో రాణించినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్ల్లో యూముంబా, బెంగాల్ వారియర్స్ రాత్రి 8 గంటలకు, తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ 9 గంటలకు తలపడనున్నాయి.