For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: భారత్ ఖాతాలో మరో పతకం.. చరిత్ర సృష్టించిన మన్‌ప్రీత్ సేన! 41 ఏళ్ల నిరీక్షణకు తెర!

India win historic mens hockey bronze
Tokyo 2020 : Men's Hockey Team భారత కీర్తి.. ఏళ్ల నిరీక్షణ 41 Years Wait Of Olympic Medal

టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ హాకీ పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లో మెడల్ సాధించింది. గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్ ఫైట్‌లో భారత్ 5-4 తేడాతో బలమైన జర్మనీని చిత్తు చేసింది. అఖండ భారతావనిని మురిపించింది. టోక్యోలో భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. అసాధారణ ఆటతో అద్భుత విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.

భారత్ తరఫున సిమ్రన్‌ జీత్‌ సింగ్‌ (17, 34 నిమిషం), హార్దిక్‌ సింగ్‌ (27నిమిషం), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29నిమిషం), రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (31నిమిషం) గోల్స్‌ చేశారు. జర్మనీలో టిముర్‌ ఒరుజ్‌ (2వనిమిషం), నిక్లాస్‌ వెలెన్‌ (24వనిమిషం), బెనెడిక్ట్‌ ఫర్క్‌ (25నిమిషం), లుకాస్‌ విండ్‌ఫెదెర్‌ (48వ నిమిషం) రాణించారు. గతంలో 8 గోల్డ్ మెడల్స్ గెల్చిన భారత్.. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఒక్క పతకం గెలవలేదు. తాజా కాంస్య పతకంతో ఆ కరువు తీరింది.

జర్మనీ‌దే ఫస్ట్ గోల్..

జర్మనీ‌దే ఫస్ట్ గోల్..

గేమ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ ప్లేయర్ టిముర్ ఒరుజ్ గోల్ సాధించి ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత భారత్‌ ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ జర్మనీ మరో గోల్‌ నమోదు చేయలేకపోయింది. చివరి నిమిషంలో ఆ జట్టుకు వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్స్ లభించాయి. కానీ వాటిని భారత డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక రెండో క్వార్టర్‌లో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంటూ ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పదే పదే దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 17వ నిమిషంలో సిమ్రన్‌జిత్ గోల్ కొట్టి భారత్ ఖాతా తెరిచాడు.

 2 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్

2 నిమిషాల వ్యవధిలో 2 గోల్స్

అనంతరం పుంజుకున్న జర్మనీ మరో 2 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ కొట్టి ఆధిక్యాన్ని 3-1 డబుల్ చేసింది. ఆ తర్వాత జర్మనీ డిఫెన్సీవ్ తప్పిదాలు భారత్‌కు కలిసొచ్చాయి. వరుసగా లభించిన పెనాల్టీ కార్నర్స్‌ను హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్స్‌మ్చడంతో సెకండ్ క్వార్డర్ 3-3తో ముగిసింది. మూడో క్వార్టర్‌లో భారత్ మరింత చెలరేగి ఆడింది. 31వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మల్చడంతో 4-3తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆ వెంటనే గుర్జంత్ సింగ్ ఇచ్చిన పాస్‌ను సిమ్రన్ జిత్‌ గోల్‌గా మలచడంతో భారత్ ఆధిక్యం 5-3తో డబుల్ అయింది. ఆ తర్వాత భారత్‌కు పలు అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

 ఆఖరి క్షణంలో ఉత్కంఠ..

ఆఖరి క్షణంలో ఉత్కంఠ..

చివరి క్వార్టర్‌లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే భారత రక్షణ శ్రేణి తప్పిదంతో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ సద్వినియోగం చేసుకుంది. లుకాస్ విండ్ ఫెడర్ కొట్టిన గోల్‌ను కీపర్ శ్రీజేష్ అంచనా వేయలేక విఫలమయ్యాడు. దాంతో భారత ఆధిక్యం 5-4కు తగ్గింది. ఆ తర్వాత మరింత జోరు కనబర్చిన భారత్.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. జర్మనీ కొట్టిన గోల్స్‌ను శ్రీజేష్ అడ్డుకున్నాడు. మరో 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనంగా.. జర్మనీకి పెనాల్టీ కార్నర్ లభించింది. కానీ భారత డిఫెన్స్ విభాగం అడ్డుకోవడంతో విజయం లాంఛనమైంది.

 మన్‌ప్రీత్ సేన జోరు సాగిందిలా..

మన్‌ప్రీత్ సేన జోరు సాగిందిలా..

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జైత్రయాత్ర అద్భుతంగా సాగింది. ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 3-2తో ఓడించిన మన్‌ప్రీత్ సేన.. జర్మనీని 2-0తో, స్పెయిన్ 3-1తో, అర్జెంటీనాను 3-1తో జపాన్‌ను 5-3తో ఓడించి జోరు కనబర్చింది. కానీ వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియా చేతిలోనే 1-7తో చిత్తయింది. ఆ తర్వాత బెల్జియంతో జరిగిన సెమీఫైనల్లో 2-5తో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కూడా దాదాపు గెలుపు ముంగిట బోల్తా పడింది. చివరి క్వార్టర్‌లో చేతులెత్తేసింది.

Story first published: Thursday, August 5, 2021, 10:40 [IST]
Other articles published on Aug 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+