
తండ్రి మరణించినా..
'వందన కుటుంబానికి జరిగిన సంఘటన విని చాలా బాధపడ్డాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆమె తండ్రి ఇటీవల మరణించారు. తండ్రి అంత్యక్రియలకు వందన వెళ్లలేదు. ఒలింపిక్స్కు ముందు వెళ్తే ట్రైనింగ్కు సమయం ఉండదని భావించి మాతోనే ఉండిపోయింది. మేమందరం దేశ నలుమూలల నుంచి వచ్చాం. మాలో హిందు, ముస్లిం, సిక్కులు ఇలా అనేక మతాలకు చెందిన వారు ఉంటారు. కానీ మాకు మతంతో సంబంధం లేదు.

మా ప్రదర్శనను ప్రశంసిస్తున్నారు..
భారత్, భారత్ జెండాకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తాము. కాబట్టి ప్రజలు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని కోరుతున్నాను. ఆటగాళ్లు.. దేశ కీర్తి ప్రతిష్టల కోసం తమ జీవితాల్ని త్యాగం చేస్తారు. ప్లేయర్స్ గెలిచినా, ఓడినా మీరు అండగా నిలవండి. అదే నా విన్నప్పం. అప్పుడే దేశం క్రీడాదేశంగా అవతరించగలదు. టోక్యో ఒలింపిక్స్లో మా ప్రదర్శనను చాలా మంది మెచ్చుకున్నారు. నెగటీవ్ కామెంట్ చేసే వారు ఈ విషయాన్ని నేర్చుకోవాలి'అని రాణి రాంపాల్ పేర్కొంది.

దళిత క్రీడాకారుల వల్లే ఓటమి..
వందన సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళల హాకీ జట్టులో "చాలా మంది దళిత క్రీడాకారులు" ఉన్నందున ఓడిపోయిందని, ఇద్దరు నిందితులు వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో శేఖర్ పేర్కొన్నారు. వందన మాత్రం ఈ వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించింది. 'ఈ విషయంపై నేనేం కామెంట్ చేయలేను. మా ఇంటి ముందు జరిగిందాని గురించి విన్నాను. నా కుటుంబంతో కూడా మాట్లాడాను. అంతా బాగానే ఉందని చెప్పారు. పోలీసులు ధర్యప్తు చేస్తున్నారు.'అని చెప్పుకొచ్చింది.

అంచనాల్లేకుండా..
అంచనాల్లేకుండా టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఆరంభంలో వరుసగా పరాజయాలపాలైనా.. ఆ తర్వాత పుంజుకొని అద్భుతం చేశారు. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్కు చేరారు. కీలక పోరులో ఒత్తిడిని జయించలేక అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో పోరాడి ఓడారు. ఇక కాంస్య పోరులో గ్రేట్ బ్రిటన్పై 3-4 తేడాతో ఓడి తృటిలో పతకాన్ని చేజార్చుకున్నారు. అమ్మాయిలు పతకం తేకపోయినా వారి ఆటతో మనసులు గెలుచుకున్నారు.


Click it and Unblock the Notifications












