
న్యూఢిల్లీ: వర్ణ వివక్షపై ఓ పక్క పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. హాకీ ఇండియా(హెచ్ఐ) మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ ముస్తాకీ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను మైనార్టీ వర్గానికి చెందిన వాడిని కావడంతో కేంద్ర మంత్రిత్వశాఖ వివక్ష చూపించిందన్నాడు. తన పేరు, మతం నచ్చక.. స్పోర్ట్స్ కోడ్ను సాకుగా చూపి తనను పదవి నుంచి తప్పించారంటూ ఆరోపించారు.
ఈ మేరకు స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజుకు మంగళవారం ఓ లేఖ రాశారు .సుదాన్షు మిట్టల్(ఖోఖో), రాజీవ్ మెహతా(ఫెన్సింగ్), ఆనందేశ్వర్ పాండే(హ్యాండ్ బాల్) వీరితో పాటు చాలా మంది ఆయా స్పోర్ట్స్ అసోసియేన్లలో టాప్ ప్లేస్ల్లో ఉన్నారు. నాకు తప్పించి వీరేవ్వరికీ స్పోర్ట్స్ కోడ్ వల్ల సమస్య రాలేదు.
నేను మైనార్టీ వర్గానికి చెందిన వాడిని కావడంతో గతంలోనూ పలుమార్లు ఇబ్బందులు పెట్టారు. నా మీద చూపిన వివక్షకు స్పోర్ట్స్ మినిస్ట్రీ సమాధానం చెప్పాలి. సరైన వివరణ రాని పక్షంలో విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తా'అని ముస్తాకీ అహ్మద్ లేఖలో పేర్కొన్నారు.