
ఇంగ్లాండ్ ప్లాన్ ప్రకారమే ఓడింది
టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, బెల్జియంతో జరిగిన మ్యాచ్లో మాత్రం గేమ్ ప్లాన్ ప్రకారమే ఓడిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి ఉంటే నాకౌట్లో జపాన్తో తలపడాల్సి ఉంటుంది. నాకౌట్లో జపాన్పై నెగ్గితే, క్వార్టర్ ఫైనల్లో బలమైన బ్రెజిల్ను ఎదుర్కొనే అవకాశం ఉంది.

బ్రెజిల్తో మ్యాచ్ తప్పించుకోవడానికే
ముందస్తు వ్యూహంలో భాగంగా బ్రెజిల్తో మ్యాచ్ తప్పించుకోవడానికి గాను బెల్జియంపై ఇంగ్లండ్ ఓడిపోయిందని నెటిజన్లు అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇంగ్లాండ్ జట్టును తెగ ట్రోల్ చేస్తున్నారు. అదే, బెల్జియంతో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు నాకౌట్లో కొలంబియాతో తలపడనుంది.
బ్రెజిల్తో పోలిస్తే స్వీడన్ లేదా స్విట్జర్లాండ్పై
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచినట్లయితే మరో నాకౌట్ మ్యాచ్లో స్వీడన్, స్విట్జర్లాండ్ మధ్య జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుంది. బ్రెజిల్తో పోలిస్తే స్వీడన్ లేదా స్విట్జర్లాండ్ జట్లపై ఇంగ్లాండ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే బెల్జియంతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయటంతో వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

ఓటమికే మొగ్గు చూపిన ఇంగ్లాండ్ ప్లేయర్లు
తొలి అర్ధభాగంలో ఇరు జట్లు ఒక్కగోల్ కూడా నమోదు చేయలేదు. అంతేకాదు మైదానంలోకి దిగిన ఆటగాళ్లు సైతం ఏ మాత్రం పోరాట పటిమను ప్రదర్శించకుండా ఓటమికే మొగ్గు చూపారు. మ్యాచ్లో పలుమార్లు గోల్ చేసే అవకాశాలు వచ్చినా ఇంగ్లాండ్ ఆటగాళ్లు కావాలని మిస్ చేశారు. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కోచ్ ఆటగాళ్లను అభినందిస్తూ స్వాగతం పలకడం ఇక్కడ చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications














