పారిస్: స్టార్ ఫుట్బాలర్, అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీకి కరోనా సోకింది. పారిస్ సెయింట్ జర్మన్(పీఎస్జీ) ఫుట్బాల్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా పాజిటీవ్గా తేలింది. ఈ విషయాన్ని (పీఎస్జీ) ఫుట్బాల్ క్లబ్ ధృవీకరించింది. జువాన్ బెర్నట్, సెర్జియో రికో, నాథన్ బిటుమజాలాకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధరాణ అయినట్లు పీఎస్జీ ఫుట్బాల్ క్లబ్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నలుగురు ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించింది. నలుగురు ఆటగాళ్లతో పాటు సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా పాజిటివ్గా తేలిందని పీఎస్జీ తెలిపింది.
వీరికి సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లను కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ఐసోలేషన్కు తరలించినట్లు పేర్కొంది. కాగా... ఫ్రాన్స్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో 219,126 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. స్పానిష్ ఫుట్బాల్ క్లబ్ బార్సిలోనాతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని లియోనల్ మెస్సీ గతేడాది తెంచుకున్న విషయం తెలిసిందే.
13 ఏళ్ల వయసులో 2000 సంవత్సరంలో బార్సిలోనాతో మొదలైన మెస్సీ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగింది. 17 సీజన్ల పాటు బార్సిలోనాతోనే ఉన్న మెస్సీ.. ఆ క్లబ్ తరఫున అత్యధిక మ్యాచ్లు, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. క్లబ్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో లియోనెల్ మెస్సీతో కాంట్రాక్ట్ను పొడిగించలేదని బార్సిలోనా ఫుట్ క్లబ్ ప్రకటించింది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన బార్సిలోనా క్లబ్లో ఉండేందుకు మెస్సీ తన జీతాన్ని 50 శాతం తగ్గించుకోవాలనుకున్నానని తెలిపాడు. 'జీతం పెంచడం కాదు.. 50 శాతం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బార్సిలోనాలోనే కొనసాగేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను' అని మెస్సీ ఫేర్వెల్ సందర్భంగా చెప్పాడు.