గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2021-22 ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్సీ ఓటమిని తప్పించుకుంది. జంషెడ్పూర్తో మ్యాచ్ను 1-1తో హైదరాబాద్ డ్రాగా ముగించింది.
జంషెడ్పూర్ తరఫున స్టీవర్ట్ (41వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే ఆట 56వ నిమిషంలో జావో విక్టర్ ఇచ్చిన పాస్ను ఎటువంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్ట్లోకి పంపిన హైదరాబాద్ స్ట్రయికర్ ఒగ్బెచె స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ మూడు మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్లో ఓడగా...ఇప్పుడు 'డ్రా' చేసుకుంది.
మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బంతిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇక ఆట 41వ నిమిషంలో స్టీవర్ట్ సూపర్బ్ గోల్తో జంషెడ్పూర్కు ఆధిక్యాన్ని అందించాడు. దాంతో ఆ జట్టు 1-0తో ఫస్టాఫ్ ముగించింది. ఇక సెకండాఫ్లో నేలకు కొట్టిన బంతిలా చెలరేగిన హైదరాబాద్ ఆటగాళ్లు బంతిని పూర్తిగా తమ ఆధినంలో ఉంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థి గోల్ పోస్ట్లోకి దూసుకెళ్తూ ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలోనే ఆట 56వ నిమిషంలో జావో విక్టర్ ఇచ్చిన పాస్ను ఎటువంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్ట్లోకి పంపిన హైదరాబాద్ స్ట్రయికర్ ఒగ్బెచె హైదరాబాద్ను గట్టెక్కించాడు. ఆ తర్వాత ఇరు జట్లు ప్రయత్నించినా మరో గోల్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.