పనాజి: ఇండియన్ సూపర్ లీగ్ (ఎస్సీఎల్) ఏడో సీజన్లో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ అదరగొడుతోంది. మంగళవారం తిలక్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై సిటీ 3-0తో ఎస్సీ ఈస్ట్ బెంగాల్ను ఓడించి లీగ్లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబై ప్లేయర్ ఆడమ్ లీ ఫొండ్రే (20వ నిమిషం, 48వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. హెర్నన్ డానియల్(58వ నిమిషంలో) మరో గోల్ రాబట్టాడు.
ప్రారంభం నుంచే ఈ మ్యాచ్లో ముంబై హవా సాగింది. 20వ నిమిషంలో బూమౌస్ నుంచి అందుకున్న పాస్ను గోల్గా మలచిన ఫొండ్రే ముంబై ఖాతా తెరిచాడు. మరోపక్క ఈస్ట్ బెంగాల్ స్ట్రయికర్లు దూకుడు చూపెట్టినప్పటికీ ముంబై డిఫెన్స్ను దాటి గోల్ సాధించలేకపోయారు. దీంతో 1-0 లీడ్తో ముంబై ఫస్టాఫ్ ముగించింది. అయితే సెకండాఫ్ మొదలైన కాసేపటికే దొరికిన పెనాల్టీ కార్నర్ చాన్స్ను ఫౌండ్రే గోల్గా మలచడంతో ముంబై లీడ్ పెరిగింది.
దీంతో బెంగాల్ ఒత్తిడిలోకి వెళ్లగా.. 58వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్ చాన్స్ను సద్వినియోగం చేసుకున్న డానియల్.. ముంబై లీడ్ను 3-0కి పెంచాడు. ఆ తర్వాత ప్లేయర్లు, స్ట్రాటజీ మారుస్తూ బెంగాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖాతా తెరవలేకపోయింది. ఇక ఈస్ట్ బెంగాల్కు ఇది వరుసగా రెండో ఓటమి.
సారీ ఆస్ట్రేలియా.. మ్యాచ్కు ముందు చేసుకోవడం వల్లే గాయమైంది.. వార్నర్ సతీమణి బోల్డ్ కామెంట్స్!