మార్గో: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) డ్రాల పరంపర కొనసాగుతున్నది. సోమవారం చెన్నయిన్ ఫుట్బాల్ క్లబ్, ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. చెన్నయిన్ తరఫున ఇస్మా(76వ నిమిషం) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. ఒగ్బెచి(21వ నిమిషం) ముంబైకి ఫీల్డ్ గోల్ అందించాడు. ఆరంభం నుంచి ఇరు జట్లు బాల్పై ఆధిపత్యం కోసం పోరాడాయి. దీంతో గోల్స్ చేసే చాన్స్లను సృష్టించుకున్నా.. టార్గెట్ను ఛేదించలేకపోయాయి. అయితే మెరుపు వేగంతో కదిలిన ముంబై ఫార్వర్డ్ ఒగ్బెచి.. లాంగ్ పాస్ను గోల్గా మలిచి జట్టును ఆధిక్యంలో నిలిపాడు.
సెకండ్ హాఫ్లో డిఫరెంట్ అప్రోచ్తో ముందుకెళ్లిన చెన్నయిన్.. మ్యాచ్ లాస్ట్ మినిట్స్లో సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మ్యాచ్ డ్రా అయ్యింది. తాజా విజయంతో ముంబై సిటీ 30 పాయింట్లతో టాప్ ప్లేస్ను పదిలం చేసుకోగా, చెన్నైయిన్ 16 పాయింట్లతో ఐదో ప్లేస్లో ఉంది.